మోదీపై “రికార్డెడ్” విమర్శలకు కేసీఆర్ వెనుకడుగు !

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వైఖరిలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఆయన మోదీపై యుద్ధం చేయడం ఆపేసినట్లుగా కనిపిస్తోంది. ఆయనపై విమర్శలు చేయడం లేదు. తాజాగా మహారాష్ట్ర నుంచి కొంత మంది రాజకీయ నేతలు వచ్చి బీఆర్ఎస్‌లో చేరే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చారు. మామూలుగానే తెలంగాణ భవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలకు మీడియాను అనుమతించడం లేదు. ఓ మీడియా ఏజెన్సీ ద్వారా లైవ్ ఇస్తూంటారు.

ఆ ఒక్క కెమెరామెన్ మాత్రమే లోపల ఉంటారు. ఇలా ప్రసంగం జరుగుతున్న సమయంలో హఠాత్తుగా కేసీఆర్ .. ఆ కెమెరామెన్‌ను లైవ్ ఆపేసి వెళ్లిపొమ్మని చెప్పారు. ఇంత వరకూ రికార్డు అయింది. మీడియాలో లైవ్ వచ్చింది. కానీ తర్వాత ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు. అప్పటి వరకూ కేసీఆర్ కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. తన జీవితం అంతా పోరాటాలేననని త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండ‌దు. చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తే గెలిచి తీరుతామని మహారాష్ట్ర నేతలకు సలహాలు ఇచ్చారు.

13 నెల‌ల పాటు దేశ రాజ‌ధానిలో రైతులు పోరాడారు అని కేసీఆర్ గుర్తు చేశారు. న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించిన రైతుల‌ను ఉగ్ర‌వాదుల‌న్నారు.. ఖ‌లీస్తానీల‌న్నారు.. వేర్పాటువాదుల‌న్నారు. రైతుల పోరాటంతో మోదీ దిగివ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్పారు. 750 మంది రైతులు చ‌నిపోతే ప్ర‌ధాని క‌నీసం స్పందించ‌లేదు. మ‌న దేశంలో దేనికి కొద‌వ లేదు. అయిన‌ప్ప‌టికీ రైతులు, ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే మోదీని మాత్రం ఎక్కడా విమర్శించలేదు. మోదీని విమర్శించే సమయానికి లైవ్ ఆపేయమని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

తాజా పరిణామాలతో నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు చేయడానికి కేసీఆర్ వెనుకాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల జోలికి వెళ్లకపోవడం.. మహారాష్ట్ర నుంచి చోటా నేతల్ని పిలిపించుకుని చేర్పించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తూండటంతో నిజమేనన్నగుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close