సీక్రెట్‌గా అమెరికా వెళ్లొచ్చిన పవన్..! ఆ తర్వాతే జగన్ పై బుల్లెట్లు..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల పద్దెనిమిదో తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పోరాటయాత్ర నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ అర్ధం కాలేదు. హైదరాబాద్ రాలేదని మాత్ర క్లారిటీ వచ్చింది. దాంతో.. పవన్ కల్యాణ్ ముంబై వెళ్లారని ప్రచారం జరిగింది. అక్కడ.. అదే సమయంలో.. టీఆర్ఎస్ వారసుడు కేటీఆర్.. ఓ కార్యక్రమంలో అవార్డు తీసుకునేందుకు ముంబై వెళ్లారు. అక్కడే… తెలంగాణ ఎన్నికలపై చర్చలు జరిపారని.. . గ్రేటర్ పరిధిలో ఓట్లను చీల్చేందుకు.. కొన్ని ఎంపిక చేసిన.. నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు సబంధించిన కొంత మంది నేతల్ని.. జనసేన బీఫాంపై నిలబెట్టబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ధృవీకరణ కాలేదు. కానీ పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియలేదు. కానీ.. తాజాగా తెలుస్తున్న సమాచారం.. పవన్ కల్యాణ్.. సీక్రెట్‌గా అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడో ముఖ్యమైన వ్యక్తితో సమావేశం జరిపి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని పయనీర్ పత్రిక జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ రిపోర్ట్ చేశారు.

పద్దెనిమిదో తేదీన అదృశ్యమైన పవన్ కల్యాణ్ 22వ తేదీన చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆయన పద్దెనిమిదో తేదీన నేరుగా అమెరికా వెళ్లి.. అక్కడ తాను కలవాలనుకున్న మనిషిని కలిసి.. చర్చించాల్సిన అంశాలు చర్చించి.. చెన్నైలో ల్యాండయ్యారు. అక్కడే ప్రెస్‌మీట్ ను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే.. చెన్నైలో ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ అలా అమెరికా వెళ్లి వచ్చిన తర్వాతనే… గతంలోఎన్నడూ లేని విధంగా జగన్‌ను టార్గెట్ చేశారు. అప్పటి వరకూ.. టీడీపీ అధినేతను.. ఆయన కుమారుడ్ని ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించి.. విరుచుకుపడే పవన్.. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ ప్రథమ ప్రాథాన్యత.. జగన్‌కు ఇస్తున్నారు. ఆయనను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ స్ట్రాటజీ మార్పు వెనుక.. అమెరికా పర్యటన ఉందని భావిస్తున్నారు.

ఇంతకీ పవన్ కల్యాణ్.. సీక్రెట్‌గా ఎవరికీ తెలియకుండా.. అమెరికా వెళ్లి ఎవర్ని కలిశారన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే.. జగన్ విషయంలో.. హార్డ్ కోర్.. విమర్శలు ప్రారంభించారు కాబట్టి.. కచ్చితంగా తన పార్టీకి చెందిన… విధివిధానాల విషయంలో..స్పష్టమైన సలహాలు పొంది వచ్చి ఉంటారని.. వాటిని ఇక్కడ అమలు చేస్తున్నారని… భావిస్తున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. లేకపోతే.. అది సీక్రెట్‌గానే ఉండే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close