నో ఫ్యామిలీ.. ఓన్లీ పాలిటిక్స్..! కూకట్‌పల్లిలో బీజేపీకి పురంధేశ్వరి ప్రచారం..!!

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె…సుహాసిని బరిలో ఉంటుందని క్లారిటీ వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ మద్దతు పలికారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి నామినేషన్ వేయించారు. పార్టీ నేతలకు.. ఎప్పుడేం చేయాలో చంద్రబాబు సూచనలు ఇస్తున్నారు. ప్రచార హోరు పెరుగుతున్న కొద్దీ.. ఒక్కొక్కరిగా.. కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సహా అందరూ ప్రచారంలోకి వస్తున్నారు. అదే సమయంలో.. నందమూరి సుహాసిని… నియోజకవర్గం మొత్తాన్ని పాదయాత్ర ద్వారా చుట్టేస్తున్నారు. మరో వైపు అమరావతి నుంచే.. చంద్రబాబు కొంత మంది కీలమైన నేతల్ని .. టీడీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గొట్టముక్కల పద్మారావు టీడీపీలో చేరుతున్నారు. ఆయన సుహాసినికి మద్దతుగా ప్రచారం ప్రారంభిచారు. ఇలా కుటుంబసభ్యులంతా.. సుహాసిని కోసం ప్రయత్నాలు చేస్తూండగా… ఆమె అత్త దగ్గబాటి పురంధేశ్వరి మాత్రం… సుహాసినిని ఓడించాలంటూ.. కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న మాధవరం కాంతారావు అనే అభ్యర్థి కోసం.. ఆమె రోడ్ షో నిర్వహించారు. వసంతనగర్ నుంచి మూసాపేట్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని టీఆర్ఎస్‌తో పాటు.. మహాకూటమిపైనా విమర్శలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీలో చేరి.. పదేళ్లు మంత్రిగా ఉండి..ఆ తర్వాత వెంటనే బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ తరపున పోటీ చేస్తే.. లేని తప్పు.. కాంగ్రెస్- టీడీపీల పొత్తుతో ఎలా వచ్చిందో కానీ.. పురంధేశ్వరి .. బీజేపీ తరపున ప్రచారాన్ని మాత్రం.. నందమూరి అభిమానులు ఊహించలేకపోయారు.

ఇప్పటి వరకూ.. ఆమె ఏ పార్టీలో ఉన్నా.. ఎన్టీఆర్ బిడ్డ అన్న కారణంతో ఆదరించిన.. నందమూరి అభిమానులు ఇక నుంచి .. అలాంటి రజర్వేషన్లు పెట్టుకోరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూకట్‌పల్లి బీజేపీకి డిపాజిట్ రాదు. కానీ.. ఓ పది వేల ఓట్లు చీల్చగలరు. అంత మాత్రం దానికే ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది చాలా మందికి అర్థం కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close