3 రాజధానుల కోసం వైసీపీ రాజ్యాంగ సవరణ !

మూడు రాజధానుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని వైసీపీ పట్టుబడుతున్నట్లుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఈ మేరకు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. రాజధానిపై రాష్ట్రానికి సర్వాధికారాలు ఉండాలని ఈ మేరకు ఆర్టికల్ త్రీని సవరించాలని ఆయన బిల్లులోని సారాంశం. అది ప్రైవేటు బిల్లే కానీ… అలాంటి బిల్లును పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని అంశంపై వైసీపీ పూర్తిగా ఇరుక్కుపోయింది. ఎటూ కదల్లేని పరిస్థితికి చేరిపోయింది.

చట్ట ప్రకారం ఇక మూడురాజధానులు చేయలేరు. అమరావతిని నిర్మించి తీరాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు. వచ్చే నెలలో సవాల్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడా అనుకూల తీర్పు వస్తుందని అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడు రాజ్యాంగసవరణ కు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనేదే లేదని జగన్ చాలా సార్లు చెప్పారు. అయినా ఇప్పుడు ఆర్టికల్ త్రీలో సవరణ కోసం వైసీపీ ఎందుకు ప్రయత్నిస్తుందో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.

సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చు.. అని జగన్ చెబుతున్నారు. అందుకే ఆయన విశాఖ వెళ్లిపోవాలని రిషికొండ దగ్గర క్యాంప్ ఆఫీస్‌ను… రెడీ చేయించుకుంటున్నారు. దానిపై అనేక వివాదాలు ఏర్పడ్డాయి. అయినా వెనక్కి తగ్గట్లేదు. స్టార్ హోటల్ పేరుతో ..కడుతున్నారు కానీ అలాంటి సౌకర్యాలతో కాకుండా ఇంటి మాదిరిగా ప్లాన్ తీసుకోవడంతో అసలు విషయం బయటపడుతుంది. ఇలా ఒకదానికి కొకదానికి పొంతన లేకుండా రాజధాని విషయంలో వైసీపీ చేస్తున్న రాజకీయం.. గందరగోళంగా మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close