వైసీపీలో అసంతృప్తి టీ కప్పులో తుపాను !

వైసీపీలో అసంతృప్తి చప్పున చల్లారిపోయింది. నిన్నటిదాకా తమ అనుచరులతో ఆందోళనలు చేయించిన వారంతా ఇవాళ జగన్‌ను కలిసి .. అసంతృప్తేమీ లేదని ప్రకటించేశారు. మొత్తం వ్యవహారాన్ని సీఎం జగన్ టీ కప్పులో తుఫాన్‌గా తేల్చేశారు. ఎక్కువగా ఆశలు పెట్టుకుని భంగపడిన ఎమ్మెల్యేలను సీఎం జగన్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడి సర్ది చెప్పారు. మంత్రి పదవి రాకపోయినా పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గదని వారికి హామీ ఇచ్చారు. దాంతో వారంతా.. తమకేమీ అసంతృప్తి లేదని ప్రకటించారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరిత వంటి తాజా మాజీ మంత్రులు … పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారధి వంటి సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు.బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇక రాజీనామా చేస్తారేమోనన్నంతగా ప్రచారం జరిగింది. కానీ జగన్ అసంతృప్తులపై దృష్టి పెట్టారు. ఆయా నేతలతో మాట్లాడి సర్ది చెప్పేందుకు సీనియర్ నేతలను పంపించారు. వారు చర్చలు పూర్తి చేశారు. బాలినేని సహా అందరూ పిన్నెల్లి, ఉదయభాను అందరూ తమకేమీ అసంతృప్తి లేదని.. పార్టీ కోసం పని చేస్తామని ప్రకటించారు. దీంతో కథ సుఖాంతమైంది.

అయితే ఈ అసంతృప్తి ఎపిసోడ్‌లో కాస్త ఎక్కువ ఆవేశ పడిన సుచరితకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సుచరిత తీరుపై జగన్ అసహనంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ నిర్ణయాన్ని ధిక్కరించడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసినా చాలా మంది బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ సుచరిత మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. సుచరిత అనుచరులు.. తమకు హైకమాండ్ సుచరిత అని ప్రకటించారు. దీంతో ఆమెను లైట్ తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close