పట్టభద్రుల ఎమ్మెల్సీలప్పుడూ వైసీపీది ఇంత కంటే ఎక్కువే హడావుడి !

ఏపీలో హోరాహోరీ పోరు జరిగిందని కొంత మంది స్వయం ప్రకటిత విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి వీరెవరూ ఏపీలో పబ్లిక్ పల్స్ ను పట్టించుకోవడం లేదు. కేవలం తమ పర్సులో పడే బరువుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నిజంగా పబ్లిక్ పల్స్ గురించి ఆలోచించాలనుకుంటే ముందుగా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుంచి విశ్లేషించుకుంటూ వచ్చేవారు.

రాష్ట్రంలో ఏ ఒక్క సర్వే సంస్థ కూడా తీసుకోలేనంత అతి పెద్ద శాంపిల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు. ఇందులో వాలంటీర్లు ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. కావాల్సినన్ని దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. అయినా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎంత ఘోరంగా అంటే… రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో సమీపంలో కూడా ఉండలేకపోయారు.

విశాఖ గ్రాడ్యూయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 94,509 వచ్చే సరికే వైసీపీ సుధాకర్ కు 59,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటికి యాభై శాతానికిపైగా రావడంతో కౌంటింగ్ నిలిపివేసి విజేతను ప్రకటించారు. అంటే దాదాపుగా రెట్టింపు ఓట్లు వచ్చాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అంత కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. పశ్చిమ రాయలసీమలోనూ విజేతగా టీడీపీ నేతే నిలిచారు. ఇంత కన్నా గొప్ప సర్వే ఏముంటుంది ?

ఈ గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని ఐ ప్యాక్ సహా అందరూ చెప్పారు. వారంతా.. డబ్బులు తీసుకుని వైసీపీకి ఏం కావాలో అది చెప్పారని.. జనాల మనసుల్లో ఏముందో చెప్పలేదని తేలిపోయింది. ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు కానీ, కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close