బీజేపీ ఒంటరి పోటీ అని నీలి మీడియా హడావుడి !

ఏపీలో చిత్రమైన రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఆ రాజకీయాల్లో ఓ వర్గం మీడియా ఎప్పుడూ పావుగానే ఉంటుంది. ఢిల్లీలో వైఎస్ వివేకా కుమార్తె ప్రెస్ మీట్ పెడితే.. ఆ ప్రెస్ మీట్ కవరేజీ ఇవ్వడానికి చానళ్లకు ధైర్యం రాలేదు. కానీ వెంటనే .. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ రావడం లేదని ఓ ప్రచారం ప్రారంభించారు. శనివారం ఉదయం కూడా అదే చేశారు. దీంతో నారా లోకేష్ మీ ఏడుపే మా ఎదుగుదల అని.. సెటైరికల్ గా .. ఆ చానళ్ల స్క్రీన్ షాట్లు షేర్ చేసి వాత పెట్టారు.

నీలి , కూలి మీడియా బ్రేకింగ్‌ల వెనుక ఓ స్పష్టమైన పొలిటికల్ ఎజెండా ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. బీజేపీతో పొత్తుల చర్చలపై టీడీపీ, జనసేన ఇంత వరకూ బహిరంగం ఏమీ చెప్పలేదు. బీజేపీ కూడా కలుస్తుందని పవన్ కల్యాణ్ మాత్రం చెబుతున్నారు. చంద్రబాబు నోటి వెంట మాత్రం బీజేపీతో పొత్తు గురించి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా రాలేదు. లిస్ట్ ప్రకటించిన రోజు బీజేపీ పేరు ఎత్తకుండానే వారు కూడా వస్తామంటున్నారని వ్యాఖ్యానించారు.

అయితే టీడీపీ, జనసేనలో బీజేపీ చేరకూడదనేది వైసీపీ టార్గెట్. జనసేనను ఆపలేకపోయారు.. ఇప్పుడు బీజేపీని అయినా ఆపాలని గట్టిగా అనుకుంటున్నారు. బీజేపీ కూటమిలో చేరితే.. తర్వాత వచ్చే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కూడా భాగస్వామిగా ఉంటుంది. అప్పుడు తమకు రక్షణ ఉండదని అనుకుంటున్నారు. అందుకే బీజేపీతో లోపాయికారీ ఒప్పందానికి రెడీ అయిపోయారు. వీలైనంత వరకూ.. బీజేపీ.. ఆ కూటమిలో పోటీ చేయకూడదని.. ప్రచారాలు ప్రారంభించారు. వారికి ప్రో వైసీపీ బీజేపీ నేతల మద్దతు ఎలాగూ ఉంది. అయితే ఈ మీడియా ల ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close