వైకాపా ఎమ్మెల్యేకి తెదేపా నేతల స్వాగతం

వైకాపా నుంచి ఇంతవరకు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. ఇవ్వాళ్ళ (గురువారం) కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా తెదేపాలో చేరితే మొత్తం 19 అవుతారు. తెదేపా నేతలు ఇంతవరకు ఎవరితో పోరాడుతున్నారో వారినే పార్టీలో చేర్చుకోవడం వలన వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వైకాపా నుంచి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తెదేపా బలపడుతోంది, వైకాపా బలహీనపడుతోంది అని సంబరపడుతుంటే, మధ్యలో ఈ ఘర్షణల వలన పార్టీలో పాతకాపులకి, కోటి ఆశలతో పార్టీలో అడుగుపెట్టిన వైకాపా ఎమ్మెల్యేలకి కూడా మనశాంతి లేకుండా పోతోంది. అయితే ఇవ్వాళ్ళ పార్టీలో చేరబోతున్న పోతుల రామారావుకి మాత్రం చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగించే అపూర్వ అనుభవం ఎదురైంది.

కందుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్-చార్జ్ దివి శివరాంతో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు కలిసి ఇవ్వాళ్ళ ఉదయం రామారావు ఇంటికి వెళ్లి ఆయనకి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజక వర్గంలో అందరం కలిసిమెలిసి పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేద్దామని చెప్పడంతో రామారావు కూడా చాలా సంతోషించి అంగీకరించారు. ఇంతవరకు 18 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు కానీ వారెవరికీ తెదేపా నేతలు ఈవిధంగా స్వాగతం పలుకలేదు. వాళ్ళే స్వయంగా బారీ బహిరంగసభ ఏర్పాటు చేసుకొని తెదేపా నేతలని ఆహ్వానించడమో లేదా తమ అనుచరులను వెంటబెట్టుకొని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి పార్టీ కండువాలు కప్పుకొని తిరిగి వెళ్లడమో చేసేవారు. రామారావుకి మాత్రం తెదేపా నుంచి సాధరంగా ఆహ్వానం లభించడం విశేషమే. తెదేపా నేతలందరూ కూడా వైకాపా ఎమ్మెల్యేలపట్ల ఇదేవిధంగా సాదరంగా వ్యవహరించినట్లయితే, తెదేపాలో చేరాలా వద్దా అని ఊగిసలాడుతున్నవారు కూడా వచ్చే చేరే ఆలోచన చేయవచ్చు. నిత్యం ఘర్షణలు పడుతుంటే, వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చు. అప్పుడు తెదేపా పని వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close