సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేల దారుణ వ్యాఖ్యలు – చంద్రబాబు కంట తడి !

చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు అత్యంత దారుణమైన వ్యాఖ్యలను అసెంబ్లీలో చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, మంత్రి అప్పలరాజు అత్యంత నీచమైన మాటలు మాట్లాడారు. దీన్ని స్పీకర్ కూడా అడ్డుకోలేదు. దీంతో చంద్రబాబు కంటి తడి పెట్టుకున్నారు. ఇంత దారుణమైన అవమానాల్ని తన జీవితంలో చూడలేదని.. ప్రజా సమస్యలపై చర్చ కోసం తాను ఇంత కాలం భరిస్తూ వచ్చానని ఇప్పుడు తన భార్యనూ రోడ్డు మీదకు లాక్కొచ్చారని ఆయన కంటతడి పెట్టుకున్నారు.

ఈ సమయంలో సీఎం జగన్ పగలబడి నవ్వుతూ కనిపించారు. మళ్లీ సీఎంగానే సభకు వస్తానని ప్రకటించారు. చంద్రబాబుకు ఈ మాటలు చెప్పేందుకు కూడా అధికార పార్టీ సభ్యులు అవకాశం ఇవ్వలేదు. ఆయన మైక్‌ను స్పీకర్ మధ్యలో కట్ చేశారు. అసెంబ్లీ మొదటి రోజునే చంద్రబాబును ఘోరంగా అవమానించాలన్న ఎజెండా సీఎం జగన్ బయట పెట్టారు. కుప్పం ఓడిపోయాక ఆయన మొహం చూడాలని ఉందంటూ కామెంట్లు చేశారు. ఈ రోజు చంద్రబాబు సభలోకి రాగానే… కొడాలి నాని, అంబటి రాంబాబు సహా అందరూ చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడానికే ప్రయత్నించారు.

అది శృతి మించిపోయింది. ఓ యువతితో అసభ్యంగా మాట్లాడుతూ రెండు సార్లు దొరికిపోయిన అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే వస్తానని.. వైసీపీ పతనంచూసిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేసి వెళ్లారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close