జ్యోతుల, వరుపుల తెదేపాలో చేరిక ఖాయం

ముందే చెప్పుకొనట్లుగా వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు తెదేపాలో చేరబోతున్నారు. వారిద్దరూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడుని ఆయన నివాసంలో కలిసి, తెదేపాలో చేరాలనుకొంటున్నట్లు చెప్పినట్లు సమాచారం. అందుకు ఆయన వారిని అభినందించి పార్టీలోకి స్వాగతం పలికారని సమాచారం. కనుక నేడో రేపో వారివురు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరడం ఖాయం.

ఇంతవరకు తెదేపాతో భీకరంగా పోరాడిన జ్యోతుల నెహ్రూ, సుబ్బారావు ఇప్పుడు తెదేపాలోనే చేరాలనుకావడంతో సహజంగానే తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకిస్తారు. కనుక వారితో సర్దుబాట్లు చేసుకొని ఏవిధంగా అందరూ కలిసి పనిచేయాలనే విషయంపై వారు ముగ్గురూ తమ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) ఈ మధ్యనే ఆకస్మికంగా మృతి చెందారు కనుక అదే నియోజకవర్గానికి చెందిన సుబ్బారావుకి తెదేపాలో చేరినా ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ఆయన భావిస్తున్నారు.

వారిద్దరిలో జ్యోతుల నెహ్రు పార్టీలో చాలా సీనియర్ నేత, జిల్లాలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను బుజ్జగించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నించారు. కానీ ఆయన వైకాపాలో కొనసాగేందుకు ఇష్టపడలేదు. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ప్రజా పద్ధుల కమిటీ చైర్మన్ పదవిని కొత్తగా శాసనసభ్యుడిగా ఎన్నికయిన బుగ్గన రాజేంద్రనాథ్ కి కట్టబెట్టినందుకు అలిగి పార్టీని వీడుతున్నారు. అంటే జగన్ తీసుకొన్న మరో తొందరపాటు నిర్ణయం వలన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కోల్పోతున్నట్లు స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close