పవన్ ఒంటరి పోటీపై వైసీపీ అంచనా అదే !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే.. తాము వాలంటీర్ ను నిలబెట్టి గెలిపిస్తామని.. వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు . పొత్తులో కలిసి వస్తే వాలంటీర్ ను నిలబెడతామని.. ఓడిస్తామని మాత్రం చెప్పడం లేదు. ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో.. వైసీపీకి బాగా తెలుసని.. జోగి రమేష్ మాటలతో ఎవరికైనా అర్థమైపోతుంది.

పవన్ కల్యాణ్ వారాహియాత్రకు మంచి స్పందన వస్తుంది. అందులో సందేహం లేదు. నిజానికి పవన్ ఎక్కడ సభలు పెట్టినా జనం వస్తారు. ఇప్పుడు రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాత్ర కాబట్టి… అదీ ఎన్నికలకు ముందు కాబట్టి జనం వస్తారు. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే వచ్చారు. కానీ ఓట్లు రాలేదు. ఈ సారి ఓట్లు రాలేదు. పవన్ కల్యాణ్ సినిమా స్టార్ కావడం వల్ల ఆయన అభిమానులకు ఇతర రాజకీయ అభిప్రాయాలు బ లంగా ఉండటం వల్ల .. పవన్ రాజకీయంగా బలోపేతం కాలేకపోతున్నారు.

నిజానికి అధికార పార్టీ ఆయనను ఇంతగా టార్గెట్ చేసినా… తాను టార్గెట్ చేసిన ఓటు బ్యాంక్ ను ఏకీకృతం చేసుకోవడంలో పవన్ విఫలమవుతున్నారన్నది ఎక్కువ మంది అభిప్రాయం . అదే సమయంలో అలాంటి ప్రయత్నాల వల్ల ఇతర వర్గాలకు దూరం అవుతున్నారు. ఇంక ఆయనను రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ఆయన చుట్టూ ఉన్న వందిమాగధులు … తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇది వైసీపీ కి ఆయుధంగా మారుతోంది. అందుకే… ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ను వాలంటీర్ ను పెట్టి ఓడిస్తామని ధైర్యంగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ రెండో సారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే.. ఆయన సభలకు వచ్చే జనాలకు.. ఆయన పార్టీకి అర్థమే లేకుండా పోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close