అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ… కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.. ప్రభుత్వానికి ఐదుగురు మాత్రమే ఉన్నట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా యాభై మంది రోగులు.. పది మంది సిబ్బంది ఉన్నారు. అగ్నిప్రమాదం తర్వాత రోగుల్ని వదిలేసి సిబ్బంది పరారయినట్లుగా తెలుస్తోంది. వారందరూ క్షేమంగానే ఉన్నారు. రోగులు మాత్రం… ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయారు. క్షణాల్లోనే మంటలు విస్తరించడంతో కోవిడ్ రోగులు తేరుకోలేకపోయారు. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదంపై… ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాద కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మరో వైపు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… ఈ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సహాయ చర్యలు తీసుకున్నామని.. మృతుల కుటుంబాలకు రూ. యాభై లక్షల నష్టపరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి మోడీకి చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో వరుస ప్రమాదాలు… ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో చోట… భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యం… ప్రభుత్వ యంత్రాంగం… పూర్తిగా లైట్ తీసుకోవడం… వంటి కారణాల వల్ల… ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా కరోనా కారణంగా ప్రాణభయంతో ఆస్పత్రిలో చేరిన వారిని మంటలకు వదిలి పెట్టేసింది ఆస్పత్రి యాజమాన్యం. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close