మహానాడుని కడపలో పెట్టడం గొప్ప కాదు. దమ్ముంటే కడపలో ప్రతి ఇంటికి టీడీపీ కార్యకర్తల్ని పంపించాలి .. అని జగన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించుకున్న కొంత మంది వైసీపీ నేతల ఎదుట తన హీరోయిజాన్ని ప్రదర్శించారు. టీడీపీ కడపలో మహానాడు పెట్టుకుంటే.. జగన్ రెడ్డి ఎందుకు కుళ్లుకుంటున్నారో ఎదుట ఉన్న వారికి అర్థం అయి ఉండదు. కానీ అక్కడ అయితే గతంలో ఏ పార్టీ సభ పెట్టినా.. వైసీపీ అల్లరి మూకలు వచ్చి రచ్చ చేసి పోతాయి. ఈ సారి అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా సింపుల్ గా మూడు రోజుల పాటు ఘనంగా మహానాడు నిర్వహించడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది.
అప్పటికి పులివెందులలో ఏదో అలజడి రేపాలని ప్రయత్నించారు. వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్న చోట్ల టీడీపీ జెండాలు కట్టాలని ఆరోపించారు. వాటిని తెంపుతామని హడావుడి చేశారు. కానీ ఏమీ చేయలేకపోయారు. చిన్న అలజడి రేపినా ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయారు. మహానాడు జరుగుతున్న రోజునే జగన్ రెడ్డి పొదిలిలో పొగాకు రైతుల్ని పరామర్శించాలని అనుకున్నారు. అక్కడికి వెళ్తే పాత నిర్వాకాలు అన్నీ హైలెట్ అవుతాయని అనుకున్నారేమో కానీ రుతుపవనాల కారణంగా వర్షాలొస్తున్నాయని ఆగిపోయారు. ఇంటికి కొంత మందిని పిలిపించుకుని మహానాడుపై అక్కడ. ఎప్పట్లాగే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కడప ఒకప్పుడు వైఎస్ కుటుంబ కంచుకోట. భయపెట్టి అయినా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.కానీ ఇప్పుడు ఆ కుటుంబసభ్యులు కూడా చీలిపోయారు. వారిలో వారే చంపుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఫ్రీ అయిపోయారు. భయానికి లొంగే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే జగన్ రెడ్డి టెన్షన్ పడుతున్నారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చినా గెలవలేమని ఆయనకు తెలుసు. అందుకే అసెంబ్లీ బహిష్కరిస్తే.. అనర్హతా వేటు పడుతుదంని.. దొంగ చాటుగా ఒక్క రోజు గవర్నర్ ప్రసంగం రోజు హాజుర వేయించుకుని పదకొండు నిమిషాలు కూర్చునిపోయారు. మొత్తంగా కడపలో రాజకీయం మారిపోయిందని మాత్రం జగన్ గుర్తించకపోతే సమస్యలు పెరగడం ఖాయమని అనుకోవచ్చు.