రాజారెడ్డి శతజయంతిని జగన్ పట్టించుకోలేదు. మర్చిపోయారు. కానీ ఉదయమే వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల మాత్రం కడపలోని ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. చర్చిలో ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేశారు. ఆ తర్వాత తాత రాజారెడ్డి గురించి కాస్త గొప్పగా చెప్పారు. YSR ను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి తీర్చి దిద్దారరని..YSR లెజెండ్ అయ్యారు అంటే రాజారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమేనని చెప్పుకొచ్చారు. తాను దగ్గర నుంచి రాజారెడ్డిని దగ్గర నుండి చూశానని రజల కోసం ఎన్నో విద్యాసంస్థలు .. ఆస్పత్రి కూడా కట్టించారన్నారు. రాజారెడ్డి గారి స్పూర్తి మాకు ,నేటి తరానికి ఎంతో ఆదర్శమని చెప్పుకొచ్చారు.
తాత వందో జయంతిని షర్మిల,విజయమ్మ ఇలా సెలబ్రేట్ చేస్తే మరి జగన్ ఏం చేశాడబ్బా అని కొంత మంది పరిశీలించారు.కానీ ఆయనకు విషయం తెలియదో.. తెలిసినా వైఎస్ జయంతుల్నే పట్టించుకోవడం లేదు.. ఇక రాజారెడ్డి గురించి ఏం ఆలోచిస్తామనుకున్నారో కానీ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు. అయితే షర్మిల, విజయమ్మ నివాళుల తర్వాత ఏదో ఒకటి చేయకపోతే బాగుండదని అప్పటికప్పుడు విజయవాడలోని ఓ అనాథ ఆశ్రమానికి వస్తానని కబురు చేశారు. అక్కడ వైసీపీ నేతలు ఓ రాజారెడ్డి పటాన్ని ..చిన్న ప్లాస్టిక్ కుర్చీలో పెడితే.. అక్కడ నలుగురు పిల్లలతో కలిసి తాత వందో జయంతిని పూర్తి చేశారు.
జగన్ రెడ్డికి రాజారెడ్డి పోలికలు వచ్చాయని చెబుతూ ఉంటారు. జగన్ రెడ్డి పై రాజారెడ్డి ఎక్కువ ప్రేమ చూపించేవారని కూడా చెబుతారు.కానీ అలాంటి తాత ను జగన్ రెడ్డి మర్చిపోయారు. కనీసం పులివెందులలోని ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించలేకపోయారు. అవసరం లేకపోతే.. ఒక్క అడుగు కూడా వేయరని.. ఇప్పుడు షర్మిల నివాళులు అర్పించబట్టి.. విజయవాడలో ఆ మాత్రం ఫోటోకు దండ వేశారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.