ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు షాక్ ఇచ్చిన జగన్..!

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. విశాఖలో గత ప్రభుత్వం ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయించిన ఏకరంన్నర స్థలాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థల కేటాయింపులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని.. అందులో ఎలాంటి నిర్మాణాలు లేవని… సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆ స్థలం విలువ నలభై కోట్లకుపైగా ఉంటుందని.. కానీ చంద్రబాబు సర్కార్ యాభై లక్షల రూపాయలకే ఇచ్చిందని…ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రజ్యోతికి ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రకటనలు నిలిపి వేసింది. ఇప్పుడు… ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో.. అన్నీ తీసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ కేబినెట్ నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఖండించింది. ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని మండిపడింది. చంద్రబాబు సర్కార్ తమకు ఎలాంటి భూమి కేటాయించలేదని.. అది.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా… తీసుకున్న స్థలానికి ఇచ్చిన పరిహారమని.. ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రకటించింది. 1980 దశకంలో.. ఆంధ్రజ్యోతికి చెందిన ఎకరం స్థలాన్ని రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా ఇచ్చిన స్థలం కూడా.. అలాగే భూసేకరణలో వెళ్లిపోయింది. దీనికి ప్రతిగా… పరదేశి పాలెంలో.. ఎకరంన్నర భూమిని కలెక్టర్ సిఫార్సు మేరకు.. ఆమోద పబ్లికేషన్స్ కు ఇచ్చారు. ఈ భూమికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ.. కలెక్టర్ ఆ మేరకు సిఫార్సు చేయడంతో రూ. యాభై లక్షలకుపైగా చెల్లించినట్లుగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతోంది.

పూర్తి న్యాయబద్ధంగా జరిగిన కేటాయింపులను రద్దు చేయడం… చట్ట విరుద్ధమని.. ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతోంది. ఈ మేరకు వారు న్యాయపోరాటం చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. నిజానికి పరిహారంగా ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవడం… సాధ్యం కాదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమల కోసమో.. ఇతర అవరసాల కోసమో.. వాటికి తగ్గ నిబంధనలను … స్థలం పొందిన కంపెనీలు.. సంతృప్తి పరచకపోతే.. కేటాయింపులు రద్దు చేయడానికి.. స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు. మొత్తానికి ఆంధ్రజ్యోతికి జగన్మోహన్ రెడ్డి దెబ్బమీద దెబ్బకొడుతున్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close