వివేకా హత్యపై రాజకీయం..! జగన్‌పై కుటుంబ సభ్యుల అసంతృప్తి..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై.. నేరుగా.. చంద్రబాబునాయుడు, లోకేష్, ఆదినారాయణరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన ఇతర బాబాయిలు… షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయం కోసం కొంత మంది ఇలాంటి ఆరోపణలు చేస్తూంటారని… జగన్‌పై పరోక్షంగా.. మరో బాబాయ్ వైఎస్ ప్రతాప్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వివేకా హత్యపై ఎలాంటి అనుమానాల్లేవని, సీబీఐ విచారణ కోరడం రాజకీయంగా చేసిన వ్యాఖ్య కావచ్చని ఆయన నేరుగానే ప్రకటన చేశారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నారు. కుటుంబంలోని గొడవలపై.. పోలీసులు తమకు దొరికిన ఆధారాల ఆధారంగా… వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులందర్నీ పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైనింగ్ ఆర్దిక లావాదేవీల విషయంలో ప్రతాప్ రెడ్డి ఇంటి ముందే గతంలో వివేకా ధర్నా చేశారు.

వైఎస్ వివేకా హత్యలో .. అసలు ఏం జరిగిందో.. కుటుంబసభ్యులందరికీ స్పష్టంగా తెలుసన్న అభిప్రాయం… పోలీసుల్లో ఉంది. వారి ద్వారానే విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో… కాల్ డేటా, వివాదాలు, కిరాయి హంతకులు చెప్పిన సమారాన్ని బట్టి ఎప్పటికిప్పుడు.. కొంత మందిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఒకదానికి ఒకటి లింక్‌గా ఇప్పటికే మిస్టరీ వీడిపోయిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. పోలీసులు ఏ క్షణమైనా పూర్తి డీటైల్స్ ప్రకటించనున్నారు. ఈ తరుణంలో.. వైఎస్ వివేకా సోదరులు… రాజకీయంగా ఎలాంటి ఆరోపణలు చేయడానికి సిద్ధపడటం లేదు. ఒక్క జగన్ మాత్రమే టీడీపీపై విమర్సలు చేసి.. రాజకీయంగా దీన్నో ప్రచారాస్త్రం చేసుకుంటున్నారన్న అసంతృప్తి.. వైఎస్ కుటుంబసభ్యుల్లో ఏర్పడింది.

వైఎస్ వివేకా హత్య కేసులో… మొదటి నుంచి ఏం జరిగిందన్ నదానిపై… ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. హత్యను గుండెపోటుగా ప్రచారం చేయడం దగ్గర్నుంచి అనేక అంశాల్లో ప్రజల్లో సందేహాలున్నాయి. అవేవీ కూడా.. రాజకీయ పరమైనవి కావు. వాటిపై క్లారిటీ ఇవ్వకుండా.. జగన్మోహన్ రెడ్డి.. టీడీపీపై ఆరోపణలు చేస్తూండటంతో.. విషయం మరింత పెద్దదైపోయింది. దీంతో.. సాక్ష్యాలు తుడిచేయడం….అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇది వైఎస్ కుటుంబసభ్యులపై రోజుకో రకం ప్రచారం జరుగుతోంది. దీనికంతటికి కారణం… జగనేనని… అసంతృప్తి పెరిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close