సెంటిమెంట్‌తో కొడుతున్న షర్మిల – భారతి ఏం చేస్తారో !?

కొంగు చాచి అడుగుతున్నా ఆదరించండి అని షర్మిల అడుగుతున్న దృశ్యాలు .. కరుడుగట్టిన వ్యక్తినైనా కాసేపు ఆలోచింప చేసేలా ఉన్నాయి. పులివెందులలో ప్రచారం చేసిన షర్మిల, సునీత మహిళా సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డనని .. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్న జగన్ రెడ్డి రోడ్డున పడేశారని నేరుగా చెబుతున్నారు. ఆడిపిల్లలు అలా రోడ్డున పడి దీనంగా తమకు అండగా ఉండాలని వేడుకుంటూంటే.. ఓటర్లకు అయ్యో పాపం అనిపించక మానదు.

నిజానికి ఇలాంటి వేడుకోళ్లు జగన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో కనిపించాయి. అప్పట్లో ప్రజల దగ్గర ఇలాగే వైఎస్ కుటుంబం విజ్ఞప్తి చేసింది. వీధి వీధినా .. విజయమ్మ, ,షర్మిల దీనంగా ఉన్న పోస్టర్లు పెట్టారు. జగన్ రెడ్డి కటకటాల వెనుక ముత్తయిదువులా కూర్చున్న ఫ్లెక్సీలను ఊరూవాడా ఏర్పాటు చేశారు. ఆ సెంటిమెంట్ భారీగా వర్కవుట్ అయింది. ఇప్పుడు మోసం చేసిన అన్నపై అదే సెంటిమెంట్ ను.. బాధితులుగా షర్మిల, సునీత ప్రదర్శిస్తున్నారు. ఇది ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

వైఎస్ తో అనుబంధం పులివెందుల ప్రజలకు ఎక్కువ కాబట్టి.. ఓటర్లలో మార్పు అనేది వస్తే అక్కడే తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే.. మొదటికే మోసం వస్తుంది. వీరిని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి భారతిని రంగంలోకి దించారు. ప్రచార బాధ్యతలను ఆమె తీసుకున్నారు. తీసుకున్న రోజే. షర్మిల, సునీత ప్రచారాన్ని అడ్డుకునేలా కొంత మంది రచ్చ చేశారు. అంటే.. వీరిద్దర్నీ ఎదుర్కొనే వ్యూహం చేతల్లోనే ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి.

మొత్తంగా షర్మిల న్యాయం చేయాలన్న దీనమైన విజ్ఞప్తులతో ప్రజల్లోకి వెళ్తే… సెంటిమెంట్ పండుతుంది. దీనికి విరుగుడుగా భారతి వేసే ప్రణాళికలు కీలకం కానున్నాయి. లేకపోతే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని నిరూపించేస్తారు షర్మిల, సునీత.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close