వైసీపీ, జనసేన… ఎవరు ఎవరితో కలవాలనుకుంటున్నారు..?

పొత్తు కోసం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. టీఆర్ఎస్ నేతలతో రాయబారం చేయిస్తోందంటూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడానికి… టీఆర్ఎస్ కు వైసీపీ అవకాశం ఇవ్వడమే కాదు.. పొత్తుల విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఆ పార్టీని తీసుకురావడం… ప్రజల్లో చర్చనీయాంశమయింది. అందుకే వైసీపీ నేతలు కూడా… పవన్ చేసిన విమర్శలపై .. వెంటనే స్పందించారు. వైసీపీతో పొత్తు కోసం.. పవన్ కల్యాణ్ ను కలిసిన టీఆర్ఎస్ నేత ఎవరో తెలియ చేయాలని వైసీపీ నేత పార్ధసారథి డిమాండ్ చేశారు. అంతే కాదు.. పవన్ కల్యాణ్ కు వైసీపీతో పని చేయాలని ఉన్నట్లు ఉందని.. అందుకే అలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.

జనసేన, వైసీపీ మధ్య పొత్తు కుదర్చడానికి చాలా తీవ్ర స్థాయిలో.. ఢిల్లీ రేంజ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరమైనప్పటి నుంచి ఈ ప్రచారం ఉంది. మధ్యలో వారు… చాలా కాలం పాటు ఎలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోలేదు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. మళ్లీ విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ విమర్శలు వ్యక్తిగత రేంజ్ కి వెళ్లిపోయాయి. చివరికి.. ఇక పొత్తుల్లేనట్లే అన్న పరిస్థితి వచ్చే సరికి.. తెలంగాణ ఎన్నికలు పరిస్థితిని మార్చినట్లు కనిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ.. జనసేన నేతలు కానీ.. తాము పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఎప్పుడూ చెప్పుకోవడం లేదు. ఇద్దరూ తాము 175 నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తామని ప్రకటిస్తున్నారు. మళ్లీ ఈ రెండు పార్టీల వైపు నుంచే పొత్తుల ప్రకటనలు వస్తున్నాయి. తమతో కలవడానికి వైసీపీ రాయబారాలు చేస్తోందని జనసేన అంటూంటే… తమతో పోటీ చేయడానికి జనసేనకే ఆసక్తిగా ఉందని.. అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఏపీ ప్రతిపక్ష పార్టీలు రెండింటికి… ఎన్నికల్లో కలసి పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదని అర్థమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close