రమేష్‌కుమారే ఎస్‌ఈసీగా తేల్చిన వైసీపీ ఎంపీ..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆ పార్టీ నాయకత్వ ఆలోచనలకు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా… రమేష్‌కుమారే ఉన్నారని.. రఘురామకృష్ణంరాజు మీడియాను పిలిచి మరీ చెప్పేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆయనే ఎస్‌ఈసీగా ఉంటారని.. ఒక వేళ ఏపీ సర్కార్ కాదంటే… కోర్టు ధిక్కార పిటిషన్లు పడేప్రమాదం ఉందని ఆయన చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున.. గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్, జీవోలను రద్దు చేసినందున.. ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ పదవిలో ఉన్నట్లేనని చెబుతున్నారు.

తమ పార్టీ ప్రభుత్వం మాత్రం… భిన్నమైన అర్థాలు తీస్తూండటం.. రమేష్‌కుమార్‌ను మళ్లీ ఎస్‌ఈసీ పదవిలో ఉంచేందుకు సిద్ధపడకపోవతూండటం తప్పు అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు విషయంలో ఏపీ సర్కార్ చేస్తున్న వాదనలను ఆయన తోసి పుచ్చారు. తీర్పు మొత్తం సారాంశాన్ని తీసుకోవాలి కానీ.. ఒక్కో పదాన్ని విశ్లేషించుకుని సొంత అర్థాలు తీసుకుంటే కుదరదని ఆయనంటున్నారు. రమేష్‌కుమార్‌ను రాజ్యాంగంలోని 243కే అధికారం కింద నియమించారని.. జస్టిస్ కనగరాజ్‌ను పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నియమించారని గుర్తు చేశారు. అందుకని కనగరాజ్ నియామకం చెల్లకపోతే.. రమేష్ కుమార్ నియామకం చెల్లదని ప్రభుత్వం చేసే వాదనల్లో అర్థం లేదని రఘురామకృష్ణంరాజు అంటున్నారు.

రఘురామకృష్ణంరాజు అవసరం ఉన్నా లేకపోయినా…. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఎస్‌ఈసీ విషయంలో తమ పార్టీ.. ప్రభుత్వ అభిప్రాయం.. ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు. కానీ.. ఉద్దేశపూర్వకంగానే ఇలా స్పందిస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

మరికాసేపట్లో భారీ వర్షం…ఎవరూ బయటకు రావొద్దని అలర్ట్..!!

హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close