మండలి రద్దు చేస్తే మా పరిస్థితేంటి..? వైసీపీలో టెన్షన్..!

వైసీపీలో మండలి రద్దుపై అంతర్మథనం ప్రారంభమైంది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి 9 మంది సభ్యులున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, అసెంబ్లీ టికెట్లు కేటాయించే తరుణంలో కొంతమందికి ఇవ్వలేకపోయారు. వారందరికీ తర్వాత ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. వీరితోపాటు ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉండి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పదవీ గండం ఏర్పడనుంది. ఇక నుంచి శాసనమండలిలో ఖాళీ అయ్యే ప్రతి పదవి కూడా వైసీపీకి దక్కనుంది. శాసనసభ నుంచి ఎన్నికయ్యేవారిలోను, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను గెలిపించుకునే బలం ప్రస్తుతానికి వైసీపీకుంది.

రాబోయే నాలుగేళ్లు సుమారు 30 నుంచి 35 మంది వరకు వైసీపీ నేతలకు ఈ పదవులు దక్కే అవకాశం ఉందని వైసీపీ నేతలే గుర్తుచేస్తున్నారు. అటువంటి అవకాశాన్ని జారవిడుచుకోవటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనను సీఎం జగన్ వద్ద కూడా కొంతమంది నేతలు వినిపించారు. కొంతమంది న్యాయనిపుణులు కూడా శాసనమండలి రద్దు మంచిదికాదని జగన్ కు సూచించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ తీర్మానించి శాసనసభలో ఆమోదించటం తేలికైనప్పటికీ, కేంద్రం వద్దకు బిల్లు పంపి పెండింగ్ లో పడితే పరిస్థితి ఏమిటని వైసీపీ వ్యూహకర్తలు, న్యాయనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు మండలి రద్దుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

మండలి రద్దుకు హోంశాఖ, న్యాయశాఖ బిల్లును రూపొందించి కేంద్ర కేబినెట్ లో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోక్ సభ, అనంతరం రాజ్యసభలోనూ ఆమోదించాలి. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. అందువల్ల ఇన్ని సంశయాల నేపథ్యంలో మండలి రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపి అది అమలు కాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు సూచించినట్టు తెలిసింది. జగన్ కూడా.. టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీలోకి వస్తే.. రద్దు చేయనని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close