“బద్వేలు” ఏకగ్రీవం లేనట్లే – వైసీపీ టార్గెట్ లక్ష !

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం చాన్స్ లేదని తేలిపోయింది . కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మను అభ్యర్థిగా ఖరారు చేశారు. బీజేపీ తరపున కూడా మాజీ ఎమ్మెల్యే జయరాములు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. నామినేషన్లకు ఎనిమిదో తేదీ ఆఖరు. దాంతో ఈ రోజు లేదా రేపు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయడంతో ఉపఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం లేదు. సంప్రదాయం కోసం అంటూ తెలుగుదేశం, జనసేన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.

భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా జనసేన మద్దతివ్వడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ డాక్టర్ సుధకే మద్దతిస్తున్నట్లుగా చెప్పారు. దివంగత ఎమ్మెల్యే భార్య కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పడం నేరుగా మద్దతివ్వడం కిందకే వస్తుంది.ఇప్పుడు మిత్రపక్షం పోటీ చేసినా జనసేన మద్దతు ఇవ్వదు. అయితే తాము అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వెళ్లి పవన్ కల్యాణ్‌ను అడుగుతామని సోము వీర్రాజు ప్రకటించారు.

వైసీపీ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆయన సతీమణి దాసరి సుధను పోటీకి దించాలని వైసిపీ నాయకత్వం నిర్ణయించింది. ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. లక్ష ఓట్ల మెజార్టీనే లక్ష్యంగా పని చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 2015లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోవడంతో వైసీపీ పోటీ పెట్టలేదు. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో నిలవడంతో టీడీపీ అభ్యర్థికి లక్షా పదివేలకుపైగా మెజార్టీ వచ్చింది. ఆ మార్క్ దాటాలని సజ్జల లక్ష్యంగా పెట్టుకున్నారు. బద్వేలులో 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close