వైసీపీ గురి ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమవైపుకు వచ్చినప్పటికీ, వారిని పార్టీలో చేర్చుకుంటే అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వీరందర్నీ పార్టీకి రాజీనామా చేయించి వైసీపీలో చేరకుండా శాసనసభలో తటస్థ ఎమ్మెల్యేలుగా కూర్చొబెట్టాలని వైసీపీ వ్యూహకర్తలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ వల్లభనేని వంశీమోహన్ తో ఈ మిషన్ కు శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ వంశీని సస్పెండ్ చేసింది. అంటే.. ఆయన వైసీపీలో చేరితే మాత్రమే… అనర్హతా వేటుకు గురవుతారు. లేకపోతే..జగన్ చెప్పే వరకూ ఎమ్మెల్యేగానే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే.. ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వేరు చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించి తటస్థ గ్రూపుగా ఏర్పాటు చేయించే కొత్త వ్యూహానికి సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అవసరమైనప్పుడు ఆ నేతలతో తెలుగుదేశాన్ని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును దూషించడమే కాకుండా రాజీనామాలు చేయించి అవసరమైతే ఉప ఎన్నికలకు కూడా వెళ్లాలని ఆ పార్టీ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. మొత్తం ఏడుగుర్ని టీడీపీకి దూరం చేస్తే.. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా రద్దవుతుంది. వంశీ దూరం కాగా..విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీ వైపు చూస్తున్నారు. రేపో మాపో ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మరో నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.

వైసీపీతో టచ్ లో ఉన్నారని సమాచారం అందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలను తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల పిలిపించి మాట్లాడారు. తమపై ఒత్తిడి పెరుగుతుందని, వ్యాపారపరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని చంద్రబాబు ఆపగలరా లేదా.. అనేదానిపై టీడీపీ ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా.. అనేది తేలుతుంది. అయితే.. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా.. రాజకీయంలో వచ్చే మార్పేమీ ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close