కడప జిల్లాపై వైసీపీకి అంత కంగారు ఎందుకు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కడప జిల్లా విషయంలో కంగారు పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసి..వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు.. దానికి తగ్గట్లుగా.. ఢిల్లీ స్థాయిలో తమకు ఉన్న పరిచయాలతో చేయిస్తున్న సోదాలు… ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి… కడప జిల్లాలో.. బలమైన నాయకులందరూ… వైసీపీకే ఉన్నారు. డబ్బు విషయంలో కానీ.. ఫ్యాక్షన్ విషయంలో కానీ.. ఎన్నికల సమయంలో గడబిడ సృష్టించే… అనుచరగణం ఉన్న నేతలు కూడా… ఎక్కువగా వైసీపీలోనే ఉన్నారు. అయితే ఒక్క వైసీపీ నేత ఇంటిపైనా దాడి జరగడం లేదు. కానీ చిత్రంగా… ఎలాంటి.. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లేని… టీడీపీ నేతల ఇళ్లపై మాత్రం పోలీసులు విరుచుకుపడుతున్నారు.

మైదుకూరు నియోజకవర్గంలో… టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయన భారీగా డబ్బులు ఖర్చు పెట్టి.. ఫలితాలను తారుమారు చేస్తారని భయపడుతున్నారేమో కానీ… ఆయనపై.. హఠాత్తుగా ఐటీ దాడులు చేయించారు. ఆయన ఇంట్లో ఏమీ దొరకలేదు. ఆ సందర్భంగా.. పై నుంచి ఒత్తిళ్లు వచ్చాయని…అందుకే సోదాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దాంతో.. కడపపై పై స్థాయిలో దృష్టి పడిందని తేలిపోయింది. ఇది జరిగి రెండు రోజులు కాక ముందే ఈ సారి సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆయన కూడా.. టీడీపీకి ఆర్థికంగా అండగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అందుకే.. ఈసీ స్థాయిలో తమకు ఉన్న పలుకుబడితో సోదాలు చేయిస్తున్నారన్న అభిప్రాయం జిల్లా అంతటా ఏర్పడింది.

వైసీపీ నేతలు.. కడప జిల్లా విషయంలో.. ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారనేది.. చాలా మందికి అర్థం కావడం లేదు. కంచుకోటగా.. చెప్పుకుంటూ.. తిరుగులేదని… సవాళ్లు చేస్తూ.. ఇప్పుడు టీడీపీ నేతలను.. టార్గెట్ చేయడం ఏమిటన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. ఐటీ అయినా.. పోలీసు అధికారులు అయినా.. సహజంగా.. అధికార పార్టీ నేతలపై.. పెద్దగా దృష్టి పెట్టారు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా.. ఈసీ ద్వారా.. ఇప్పుడు వైసీపీ మేనేజ్ చేసి… అడ్వాంటేజ్ తమకు వచ్చేలా చూసుకుంటోంది. ప్రస్తుతం కడపలో జరుగుతున్న పరిణామాలు.. ఆ పార్టీ … ఎన్నికల పరంగా ఎంత ఒత్తిడికి గురవుతుందో.. తెలియచేస్తుందన్న అభిప్రాయం… రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close