వైసీపీలో ఆ మూడు ఎమ్మెల్సీలు వాళ్లకే..!?

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ఆగస్టు 26వ తేదీన జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎమ్మెల్సీలుగా ఉన్న కరణం బలరామకృష్ణ మూర్తి, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వాటిని భర్తీ చేయబోతున్నారు. మూడు స్థానాలు వైసీపీకే దక్కబోతున్నాయి. టిక్కెట్లు ఇవ్వలేకపోయిన నేతలకు.. జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇలాంటి వారు ఓ వంద మంది ఉంటారన్న చర్చ వైసీపీలో ఉంది.

ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రివర్గంలోకి మోపిదేవి వెంకట రమణకు కేబినెట్ లో స్థానం కల్పించారు. తప్పనిసరిగా వెంకట రమణకు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాల్సి ఉండటంతో పదవి ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ గుంటూరులో జరిగిన రంజాన్ విందులో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇక్బాల్ కూడా ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నారు. మరో పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పలువురు నేతలు ఈ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. తమకు పదవి ఇవ్వాలని పార్టీలోని కీలక నేతల ద్వారా తెరవెనుక లాబీయింగ్ ప్రారంభించారు.

కర్నూల్ జిల్లా బనగానపల్లికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డికి మూడో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కు కూడా మంత్రి పదవిని ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అక్కడ అభ్యర్థి విడదల రజినిని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు తనకు ఎమ్మెల్సీ పదవి లభిస్తుందేమోనని రాజశేఖర్ ఎదురుచూస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేయాలని భావించిన లేళ్ల అప్పిరెడ్డి స్థానంలో ఏసురత్నానికి టికెట్ ఇచ్చారు. అప్పట్లో అప్పిరెడ్డికి పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే పదవి ఇస్తామని జగన్ ప్రకటించారు. దీంతో అప్పిరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close