అతిధీమాతోనే తెదేపా పెడన పీఠం చేజార్చుకొందా?

తెదేపాకి కంచుకోట వంటి కృష్ణాజిల్లాలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అందుకు అతి ధీమాయే కారణం కావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెదేపా కాస్త ఏమరుపాటుగా ఉన్నందున దానికి దక్కవలసిన పెడన మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవిని వైకాపా ఎగురేసుకు వెళ్ళిపోయింది. పెడన మున్సిపల్ కౌన్సిల్లో రెండు పార్టీలకి చెరో 11మంది కౌన్సిలర్లు ఉన్నారు. కానీ తెదేపా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నందున తెదేపాకే అధ్యక్ష పీఠం దక్కాలి. ఖచ్చితంగా తమకే దక్కుతుందని తెదేపా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ తెదేపా కౌన్సిలర్ స్రవంతి ఎవరూ ఊహించని విధంగా వైకాపా చైర్మన్ అభ్యర్ధి బండారు ఆనంద్ ప్రసాద్ కి ఓటేయడంతో అయన అనూహ్యంగా గెలుపొందారు. ఇది చూసి తెదేపా షాక్ అయ్యింది. అసలు తమ కౌన్సిలర్ ఒకరు వైకాపాకి ఓటేస్తారని వారు ఊహించకపోవడం చేతనే వారు తమ పార్టీ గెలుపు ఖాయం అనే ధీమాతో వ్యవహరించారు. ఆ ధీమాయే తెదేపా కొంప ముంచింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు స్రవంతిపై తెదేపా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. కానీ జరిగిన నష్టాన్ని సరిదిద్దలేరు. ఆమె కూడా వైకాపాలో చేరిపోతే తెదేపాకి ఒక కౌన్సిలర్ తగ్గిపోతారు. వైకాపా మరి కొంత బలపడుతుంది. మరి తెదేపా ఏవిధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.

పెడన మండల పరిషత్ వైకాపా చేతిలోనే ఉంది. దానిలో వైకాపాకి ఆధిక్యత ఉన్నందున వైకాపాకి చెందిన అచ్యుతరాజు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close