బాహుబ‌లి 2… ప్రశ్నల‌కు స‌మాధానాలు రేపే!

బాహుబ‌లి మానియా మ‌ళ్లీ మొద‌లైంది. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్రమోష‌న్ల హంగామా మొద‌లైంది. బాహుబ‌లి 2 చుట్టూ ఎన్ని ప్రశ్నలో. ఇంకెన్ని సందేహాలో. వీట‌న్నింటికీ రాజ‌మౌళి అండ్ టీమ్ క్లారిటీ ఇవ్వబోతోంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయింత్రం 6 గంట‌ల‌కు హైదరాబాద్‌లో చిత్రబృందం ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది. బాహుబ‌లి 2కి సంబంధించిన తొలి ప్రమోష‌న్ ఈవెంట్ ఇదే. ఇంత‌కీ ఈ ప్రెస్ మీట్‌లో ఏం చెప్పబోతున్నారు? ఈ మీడియా మీట్ ఉద్దేశం ఏమిటి?

  • బాహుబ‌లి 2 పోగ్రెస్ ఏమిట‌న్న విష‌యంలో రాజ‌మౌళి క్లారిటీ ఇవ్వబోతున్నారు. కాస్త టాకీ. 5 పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్తయిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు.
  • అక్టోబ‌రు 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజు నుంచి టీజ‌ర్ల హంగామా మొద‌ల‌వ్వనుంది. అక్టోబ‌రు 23 న తొలి టీజ‌ర్ రాబోతోంది. ఎప్పుడెప్పుడు ఏయే టీజ‌ర్లు విడుద‌ల చేయ‌నున్నారో.. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మీడియాకు క్లారిటీ ఇవ్వనున్నారు.
  • బాహుబ‌లిలో పాత్రల‌న్నీ పాపుల‌ర్ అయ్యాయి. వాటిని కామిక్స్‌, టాయ్స్‌గా విడుద‌ల చేయ‌న్నారు. అందుకు సంబంధించిన విష‌యాల్ని మీడియాతో పంచుకోనున్నారు రాజ‌మౌళి.
  • బాహుబ‌లిలో కొత్త పాత్రలు, కొత్త పాత్రధారులు ఎవ‌రైనా ఉన్నారా, ఉంటే ఎవ‌రు, ఆయా పాత్రల్ని చేస్తోందెవ‌రు? ఈ విష‌యాలపై రాజ‌మౌళి క్లారిటీ ఇస్తారు.
  • బాహుబ‌లి 2 క‌థ ఇదీ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ క‌థ ప్రచారంలో ఉంది. దానిపై కూడా రాజ‌మౌళి స్పందించే అవ‌కాశ ఉంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close