అవిశ్వాసమా… చంద్రబాబు బేఫిఖర్…లండన్ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇవ్వాళ్ళ వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. కారణాలు అందరికీ తెలిసినవే. దాని వలన తెదేపా ప్రభుత్వానికి ఏమీ నష్టం ఉండదని కూడా అందరికీ తెలుసు. పైగా సోమవారం వరకు శాసనసభ సమావేశమవదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చింతగా ఈరోజు లండన్ కి బయలుదేరుతున్నారు. ఆయనతో బాటు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రభుత్వ సలహాదారు వి.రవికుమార్, ఆర్ధికశాఖ ప్రధాన కార్యదర్శి పివి రమేష్, తదితరులు కూడా లండన్ వెళతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం డిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం అవుతారు. ఆమెతో పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించి, దానికి అవసరమయిన నిధులు విడుదల చేయమని కోరుతారు. ఆ తరువాత ఈరోజు రాత్రి డిల్లీ నుంచి మూడు రోజుల లండన్ పర్యటనకు బయలుదేరుతారు. లండన్ లో పారిశ్రామికవేత్తల మండలి సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను, రాష్ట్రం సాధించిన ఆర్ధిక ప్రగతి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం గురించి వారికి వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా వారిని కోరుతారు. లండన్ లో ఉన్న ప్రవాసభారతీయులను రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకోమని ప్రోత్సహిస్తారు. చంద్రబాబు నాయుడు ఆయన బృందం మార్చి 13న మళ్ళీ లండన్ నుండి తిరిగి రాష్ట్రానికి బయలుదేరుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close