ప్రభుత్వం హామీలు అమలుచేస్తున్నా ముద్రగడ ఎందుకు దీక్ష చేస్తున్నట్లు?

ముద్రగడ పద్మనాభం మళ్ళీ రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఆయనకి నచ్చజెప్పేందుకు ఈసారి ప్రభుత్వం తరపు నుండి ఎవరూ ప్రయత్నించలేదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు కానీ ప్రభుత్వం తనకు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఆ ఆలోచన విరమించుకొనే ప్రసక్తే లేదని చెప్పారు. ఆయన కోరినట్లు ప్రభుత్వం చేయడం కుదరదు కనుక ఆయన కిర్లంపూడిలో గల తన నివాసంలో రేపటి నుండి మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టబోతున్నారు.

ఇదివరకు ఆయనకు హామీ ఇచ్చిన ప్రకారం కాపు కార్పోరేషన్ కి ఈరోజు బడ్జెట్ లో రూ. 1000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడిన జస్టిస్ మంజునాధ కమీషన్ తన పని పూర్తి చేయడానికి ఇంకా ఆరేడు నెలలు పడుతుందని ముద్రగడకి ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. అప్పుడు ఆయన కూడా అందుకు అంగీకరించారు. ఆయనకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తునప్పటికీ మళ్ళీ నిరాహారదీక్షకు సిద్దపడుతుండటం వలన ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోద్భలంతో రాజకీయ దురుదేశ్యంతోనే చేయబోతున్నట్లు అనుమానించవలసివస్తోంది. కనుక ఈసారి ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా కటిన వైఖరి అవలంభించవచ్చును. నాలుగైదురోజులు దీక్ష చేసిన తరువాత పోలీసుల చేత దానిని భగ్నం చేయించే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close