చంద్రబాబు కేసు సీబీఐ చేతికి?

ఓటుకు నోటు వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా బుక్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎం ఎ ఎ స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడారని చెప్తున్న ఫోన్ సంభాషణ నిజమైందా కాదా అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ నిజమే అయినా, స్టింగ్ ఆపరేషన్ డేటాను కోర్టులు సాక్ష్యంగా స్వీకరించే అవకాశం లేదు.

ఒక్కసారి కాదు, అనేక సందర్బాల్లో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో స్టింగ్ ఆపరేషన్ ఫుటేజిని సాక్ష్యంగా పరిగణించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తెలంగాణ ఏసీబీ మాత్రం మొదట బాబుకు నోటీసు ఇవ్వాలని భావిస్తోంది. ఆ తర్వాత ఆయన్ని విచారించాలని యోచిస్తోంది.

ఒక రాష్ట్ర ఏసీబీ అధికారులు మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటరాగేట్ చేయడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబును విచారించాలంటే గవర్నర్ అనుమతి కావాలి. సరైన ఆధారాలు, అంటే ప్రైమాఫేసీ లేకుండా గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు.

స్టీఫెన్ సన్ తో చంద్రబాబు సంభాషణ నిజమే అయినా, అందులో ఎక్కడా లంచం ప్రస్తావన లేదు. అలాంటప్పుడు బాబు ఇంటారాగేషన్ కు గవర్నర్ అనుమతినివ్వరు అనేది ఏపీ ప్రభుత్వ నమ్మకం. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని గవర్నర్ నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, చివరకు ఈ వ్యవహారం సీబీఐ చేతికి వెళ్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుత తరుణంలో కేంద్రం వైఖరి కీలకం. బీజేపీకి  టీడీపీ మిత్రపక్షం. మోడీ ప్రభుత్వంతో చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి. ఎన్నికల సమయంలో మోడీని సన్నాసి అని తిట్టిని కేసీఆర్ కు కేంద్రంతో సంబంధాలు అంతంత మాత్రమే. కాబట్టి, కేసు సీబీఐ చేతికి వెళ్తే కేసీఆర్ అనుకున్న ప్రకారం చంద్రబాబును ఇరుకున పెట్టడానికి లేదా అరెస్టు చేయడానికి అవకాశం ఉండక పోవచ్చు.

చంద్రబాబు లంచం ఎర చూపారనే ప్రాథమిక ఆధారం లేని కేసు నిలవదని ఏపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. పైగా, చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేశామని కొందరు తెలంగాణ మంత్రులు అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాప్ చేయడం చట్ట వ్యతిరేకం. ఈ పాయింటు మీద తెలంగాణ ప్రభుత్వాన్ని బర్దరఫ్ చేయాలని టీడీపీ గట్టిగా డిమాండ్ చేయవచ్చు. అప్పుడు టీఆర్ఎస్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

మోడీకి చంద్రబాబు మిత్రుడని తెలుసు కాబట్టి, ఈ కేసులో గట్టిగా పట్టుబడితే అసలుకే ఎసరు వస్తుందని కేసీఆర్ ప్రభుత్వం మిన్నకుండిపోక తప్పదనేది ఏపీ ప్రభుత్వ వర్గాల అంచనా. ఏ రకంగా చూసినా ఈ కేసు చివరకు సీబీఐ చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువని కొందరు న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close