‘కళావతి’ సినిమా కోసం 130 అడుగుల అమ్మవారి విగ్రహం

తమిళ సినిమా అరణ్మయి కు సీక్వల్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ అరణ్మయి-2 లో సిద్ధార్థ్, హాన్సిక, త్రిషలు ముఖ్య పాత్రలుగా నటించారు. సుందర్.సి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాగా ఈ అరణ్మయి-2 వస్తుంది.తెలుగులో కళావతిగా విడుదలవుతుంది ఈ సినిమా. ఇక సినిమా కోసం చెన్నైలో నాలుగు కోట్ల వ్యయంతో ఓ సెట్ వేయడం జరిగిందని చిత్రయూనిట్ చెప్పారు. అంతేకాదు 130 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగిందని అన్నారు.

ఇప్పుడు ఆ ప్రదేశం హాలీడే స్పాట్ లా మారిందని.. ప్రేక్షకులు అక్కడికి వచ్చి సేదతీరుతూ పూజలు గట్రా చేస్తున్నారని అన్నారు. రజినికాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో పనిచేసిన సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. సినిమాను సర్వాంత రామ్ క్రియేషన్స్ పతాకంలో జవ్వాజి రామాంజనేయులు నిర్మించడం జరిగింది.

తెలుగులో ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్స్ డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇటీవల ఆడియో కార్యకరమం జరుపుకున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతుంది. ప్రస్తుతం సౌత్ లో సూపర్ క్రేజ్ మీదున్న త్రిష, హాన్సికలు ఈ సినిమాలో గ్లామర్ పాత్రలతో కాకుండా థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ తో అలరిస్తారట. ఇప్పటికే సినిమా గురించి వదిలిన ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close