కేసీఆర్ హయాంలో రూ. 200 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫండ్ గోల్ మాల్

కేసీఆర్ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు దుర్వినియోగమయి నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీలో భారీ గోల్‌మాల్‌ జరిగింది. 2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎలాంటి మెడికల్‌ బిల్లులు లేకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెక్కులను అందించారు. దీంతో ఈ వ్యవహారంలో రూ.200 కోట్లు దుర్వినియోగం అయినట్టు అంచనా వేస్తున్నారు.

2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఐదేండ్లు పూర్తి కాకుండా ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సమయంలో అనుచరుల నుంచి లబ్ధి పొందేందుకే ఈ రకంగా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు దీని వెనక ఎవరు ఉన్నారు? ఏ విధంగా ముఖ్యమంత్రి సహాయనిధిని దుర్విని యోగం చేశారు? ఎవరి ఆదేశాలతో ఈ తతంగం నడిపించారనే దానిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ పెద్ద సంఖ్యలోనే ఉన్నది. అయితే అర్హులైన పేదలు రూ.లక్షల్లో పెట్టుకున్న బిల్లులకు రూ.50 వేల లోపే చెక్కుల రూపంలో అందగా.. ఎలాంటి బిల్లులు లేకుండా రూ.లక్షల్లో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నోళ్లకు అందచేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

సాధారణంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. దానికో ప్రాసెస్ఉంటుంది. అయితే 2018లో మూడు వేలకు పైగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల్లో లక్షలాది రూపాయలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లాయి. వారు ప్రత్యేకంగా సూచించిన పేర్లకే రూ.10 లక్షలు రూ.15 లక్షల దాకా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందినట్టు తెలిసింది. ఈ గోల్ మాల్ అంతా బయటకు వస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెంగళూరు రేవ్ పార్టీ…వారిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా..? ఈ విషయంలో మొదట దూకుడుగానే స్పందించిన బెంగళూరు పోలీసులు ఆ తర్వాత సైలెంట్ కావడానికి...

గేమ్ ఛేంజ‌ర్‌లో ‘జ‌న‌సేన‌’?

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్‌'. ఇదో పొలిటికల్ డ్రామా. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి పాత్ర‌కు రాజ‌కీయ...

తొలిసారి మీడియా ముందుకు ‘క‌ల్కి’

ఈ యేడాది విడుద‌ల కాబోతున్న అతి పెద్ద ప్రాజెక్టుల‌లో 'క‌ల్కి' ఒక‌టి. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ సినీ లోకం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ చిత్రానికి...

పూరి… హీరోల లిస్టు స్ట్రాంగే!

త‌ర‌వాత ఎవ‌రితో సినిమా చేయాల‌న్న విష‌యంపై పూరి జ‌గ‌న్నాథ్ పెద్ద‌గా ఆలోచించ‌డు. ఎందుకంటే పూరి స్టామినా అలాంటిది. త‌ను ఫ్లాపుల్లో ఉన్నా ఎవ‌రికీ లొంగ‌డు, భ‌య‌ప‌డ‌డు. ఇండ‌స్ట్రీలో ఉన్న ఏ హీరోతో అయినా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close