మ‌హేష్ సినిమా… ఒక్క ఫైట్‌కి రూ.3 కోట్లు??

మురుగ‌దాస్ – మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోంది. చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉండ‌గానే ఈ సినిమా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. రోజు రోజుకీ ఈ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ పెరుగుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా కోసం ఓ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌బోతున్నార్ట‌. ఆ ఫైట్ విలువ అక్ష‌రాలా రూ. 3 కోట్లు అని తెలుస్తోంది. ఈ యాక్ష‌న్ సీన్‌లో కార్ ఛేజింగులు, బోట్ డ్రైవింగులూ.. కల‌గ‌లిపి హాలీవుడ్ స్థాయిలో స్టంట్ కంపోజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ విశ్రాంతికి ముందొస్తుందా, లేదంటే క్లైమాక్స్ కోస‌మా?? అనేది తెలియాల్సివుంది.

సాధార‌ణంగా మురుగ‌దాస్ యాక్ష‌న్ సీన్స్ అన్నీ.. స‌హ‌జంగా, సింపుల్‌గా ఉంటాయి. అయితే… తొలిసారి త‌న కెరీర్‌లో యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం భారీ స్థాయిలో ఖ‌ర్చు పెట్ట‌బోతున్నాడు. ఈ ఒక్క ఫైట్ కోస‌మే 12 రోజులు కాల్షీట్లు కేటాయించాల్సివ‌చ్చింద‌ట‌. ఈ ఫైట్‌ని హాలీవుడ్ కొరియో గ్రాఫ‌ర్ల ఆధ్వ‌ర్యంలో తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.100 కోట్లుగా తేలింది. అందులో రూ.3 కోట్లు ఓ ఫైట్‌కి ఖ‌ర్చు పెట్డడం పెద్ద విశేషమేమీ కాక‌పోయినా.. అది మురుగ‌దాస్ సినిమా కాబ‌ట్టి.. ఆస‌క్తి పెరుగుతోంది. ఈ ఫైట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close