రాజేంద్రప్రసాద్ ఎక్కించిన మునగచెట్టు మీద తెలుగుదేశం!

పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకోకూడదని తెలుగుదేశం, బిజెపి పార్టీల సమన్వయ సమావేశం అవగాహనకు వచ్చి వారంతిరగకముందే ”కాబోయే ప్రధాని చంద్రబాబు, కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ బాబు” అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం రెండు పార్టీల్లోనూ అంతర్గత చర్చకు తెరలేపింది.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల్లో అధినాయకున్ని పొగడ్తలతో ముంచేసే”రాజుని మించిన రాజభక్తే” కనిపిస్తోంది. అయితే ఆయన పార్టీ అధికార ప్రతినిధి అయివుండటంతో పార్టీ హై కమాండ్ ఆమోదంలేకుండా చంద్రబాబుని భవిష్యత్తు దేశ ప్రధాని అనలేరు అని బిజెపిలో ఒక వర్గం నమ్ముతోంది. వారిలో పలువురు ఈ వ్యాఖ్యల గురించి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళారని తెలిసింది. ప్రభుత్వంలో భాగస్వాములమే అయినప్పటికీ తెలుగుదేశం తమపార్టీకి మర్యాద ఇవ్వడం లేదని ఉద్దేశ్యపూర్వకంగానే చులకనగా చూస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణ వాస్తవం కూడా! జిల్లా స్ధాయిలో కూడా రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్నేహపూరితమైన సంబంధాలు లేకపోవడమే ఇందుకు మూలం.

”వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓడిపోతేనే కదా చంద్రబాబు ప్రధాని అయ్యేది? మరి చంద్రబాబు ఎవరి కూటమిలో చేరి ప్రధాని అవుతారు? వామపక్షాల కూటమిలో చేరతారా? మూడవ కూటమికి నాయకత్వం వహిస్తారా? మరి బాబు ప్రధాని అయితే, బిజెపికి చెందిన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ఎలా అవుతారు?” అని తెలుగుదేశం నాయకుడు రాయపాటి సాంబశివరావు గతంలో వ్యాఖ్యానించడం టిడిపి ఆలోచనల్ని బయట పెడుతోందని, ఇపుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానాలు వాటిని దృవపరస్తున్నాయనీ చెబుతున్నారు.

ఇందులోకి కావాలనే వెంకయ్య నాయుడు పేరు ఈడ్చుకువచ్చి ఆయన్ని ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారి సామాజిక వర్గీయుడే అని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా బిజెపి వర్గాలు విమర్శిస్తున్నాయి. ”ఇదంతా చంద్రబాబు కి తెలిసే జరుగుతుందని చెప్పలేము…కానీ, చూసీచూడనట్టున్న వైఖరినే ఆయన కొనసాగిస్తే మాత్రం ఇదంతా ఆయనకు సమ్మతమే అనుకోవాలి. అలా అయితే రెండు పార్టీల మధ్యా కెమిస్ట్రీలు పూర్తిగా మారిపోతాయి” అని బిజెపి ముఖ్యులు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రధాని అవుతారంటే అభ్యంతరం చెప్పడానికి బిజెపికి ఏమీలేదు.అయితే తెలుగదేశం ఆలోచనలు ఇలా వున్నాయని జాతీయ స్ధాయి బిజెపి నాయకులకు తెలియపరచడానికి మాత్రం రాజేంద్రప్రసాద్ మాటలు బాగా ఉపయోగపడతాయి. ఈయన వ్యాఖ్యానాలు తెలుగుదేశం వర్గాలకు కూడా చికాకుగానే వున్నాయి. ఇలాంటి మాటల వల్ల పార్టీకి ఎంతో కొంత ఇబ్బందే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదని తెలుగుదేశం సీనియర్ నాయకలు అభిప్రాయ పడుతున్నారు.

రాజకీయనాయకులకు ప్రచారం కండూతి అవసరమే. తెలుగుదేశం వాళ్ళకి అది కాస్త ఎక్కువే! ప్రతిపక్షంలో వుంటే నోటికొచ్చింది మాట్లాటే స్వేచ్చ వుంటుంది. అలా చెలరేగిపోయే రాజేంద్రప్రసాద్ ఇపుడు అధికార ప్రతినిధి కావడంతో టివిల్లో అధినాయకుడిని మునగచెట్టు ఎక్కించే పని పెట్టుకున్నట్టు వున్నారు. కొమ్మ విరక్కుండా చెట్టుదిగి రావడమే తెలుగదేశం ముందున్న మొదటి పని!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close