తెదేపాకు ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇదివరకు ఓటుకి నోటు కేసులో తెదేపా ప్రభుత్వం ఎంతగా అప్రదిష్టపాలయిందో మళ్ళీ కాల్ మనీ వ్యవహారంలో కూడా అంతే అప్రదిష్ట మూటగట్టుకొంటోందిపుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడలోనే ఉంటునప్పటికీ ఇటువంటి నేరాలు జరుగుతుండటం, అధికార పార్టీకి చెందిన వారి పేర్లే ఈ వ్యవహారంలో ఎక్కువగా వినిపిస్తుండటంతో ప్రభుత్వం అండదండలతోనే ఆ నేరాలు జరుగుతున్నాయనే వైకాపా ఆరోపణలకు బలం చేకూరుతోంది.

ప్రత్యేక హోదా అంశంపై పోరాటాలు విఫలమయిన తరువాత చాలా డీలా పడిపోయున్న వైకాపాకు తెదేపా నేతలే ఈ కాల్ మనీ అనే బలమయిన అస్త్రం అందించారు. జగన్మోహన్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా దానిని అందిపుచ్చుకొని ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై యుద్ధం ప్రకటించేశారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతను ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ వ్రాసారు. కనీసం ఇప్పటికయినా ఈ వ్యవహారంలో దోషులందరినీ కటినంగా శిక్షించి, భాదితులకు పూర్తి న్యాయం చేయాలని తన లేఖలో కోరారు. వైకాపా నేతలు ప్రభుత్వంపై తమ దాడిని మరింత తీవ్రం చేయవచ్చును.

ఈ వ్యవహారంలో పార్టీ, ప్రభుత్వ పరువు కాపాడుకొనేందుకయినా ముఖ్యమంత్రి తన పార్టీ నేతల మీద చర్యలు తీసుకోవలసిన ఆగత్యం కలిగింది. అంత వరకు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉండవచ్చును. ఇటువంటి విషయాలలో అది చాలా అవసరం కూడా. ఈ వ్యవహారంలో ఇంకా ఎంత మంది అధికార పార్టీ నేతల పేర్లు బయటపడుతాయో తెలియదు. ఎన్ని పేర్లు బయటపడితే పార్టీకి ఇంకా అంత అప్రదిష్ట. ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి తమ నేతలపైనే చర్యలు తీసుకోవడం మొదలుపెడితే తెదేపా తన వేలితోనే తన కళ్ళు పొడుచుకొన్నట్లవుతుంది. అలాగని ఉపేక్షిస్తే ప్రతిపక్ష పార్టీలు ఊరుకోవు. దోషులను ప్రభుత్వమే కాపాడుతోందని మరింత గట్టిగా ప్రచారం చేయవచ్చును. ఈ కాల్ మనీ వ్యవహారం తెదేపాకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కటినంగా వ్యవహరించినా, వ్యవహరించకపోయినా కూడా పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే సాధారణంగా ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు వాటిని అధిగమించడానికి వేరొక అంశం లేదా సమస్య మీదకు ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నాలు చేస్తుంటాయి. కనుక ఈ కాల్ మనీ వ్యవహారంలో నుండి బయటపడేందుకు తెదేపా కూడా అటువంటి ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ సమస్యకూడా టీకప్పులో తుఫానులాగ మాయమైపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close