వైకాపా ఎమ్మెల్యేగిడ్డి ఈశ్వరి అరెస్ట్ పై హైకోర్టు స్టే

విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 10న చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడారు. ఆయన తల నరుకుతానని బహిరంగంగా హెచ్చరించారు. తెదేపా నేతల పిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను ఈకేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆమె ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ని నిన్న విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే మంజూరు చేసింది. కానీ కేసును రద్దు చేయాలన్న ఆమె అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close