ఇంతకీ లోకేష్ అనుచరుడు రాజీనామా చేసారా లేదా?

నారా లోకేష్ కి క్రమంగా పార్టీలో ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. కానీ ఆయన ప్రజా ప్రతినిధి కానందున నేరుగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోలేరు. కానీ తన అనుచరుడయిన అభీష్టని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకొని ఆయన ద్వారా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకొంటున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక ముఖ్యమయిన ఫైళ్ళను అభీష్ట తన వద్దకు రప్పించుకొని పరిశీలిస్తూ లోకేష్ తరపున అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని రఘువీరా రెడ్డి ఆరోపించారు. తద్వారా నారా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభీష్టపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

అప్పుడు అభీష్ట తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నాటి నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడం లేదని తెలుస్తోంది. కానీ అతని రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదని, ఇప్పుడు ఆయన తెదేపా కార్యాలయం నుండే ఆ పనులను చక్కబెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ఇంతకీ ఆయన రాజీనామా చేసారా లేదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటి ప్రశ్నలకు నారా లోకేష్ సంజాయిషీలు చెప్పుకోవడం కంటే ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేసి నేరుగా ప్రభుత్వం ఏదో ఒక పదవి చేపట్టవచ్చును కదా?అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close