మళ్ళీ డిఎంకె గూటికి చేరుకోబోతున్న అళగిరి

తమిళనాడులో సాధారణంగా రాజకీయాలు రెండు పార్టీల చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రస్తుతం అధికారంలో అన్నాడిఎంకె, ఒకప్పుడు అధికారంలో ఉన్న డిఎంకె పార్టీలు. తమిళనాడులో ప్రజలు ఆ రెండు పార్టీలకే మార్చి మార్చి అధికారం కట్టబెడుతుంటారు. ప్రతిపక్ష డిఎంకె పార్టీ అధినేత కరుణానిధి వృదాప్యం కారణంగా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టలేకపోవడంతో ఆయన కొడుకులిద్దరూ అళగిరి, స్టాలిన్ పార్టీపై పట్టుకోసం గొడవ పడ్డారు. వారి గొడవలు రచ్చకెక్కడంతో చిన్న కొడుకు స్టాలిన్ తన రాజకీయ వారసుడని కరుణానిధి ప్రకటించడంతో పెద్దవాడయిన అళగిరి అలిగి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగి సుమారు మూడేళ్ళు కావస్తోంది.

ఆ తరువాత డిఎంకె పార్టీని బలోపేతం చేయడానికి స్టాలిన్ చాలా కృషి చేసారు కానీ పెద్దగా ఫలితం కనబడలేదు. అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి పరిస్థితి కూడా అయోమయంగా మారింది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి వెళ్ళినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె చాలా బలహీనంగా ఉండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని లబ్ది పొందలేకపోయింది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో దక్షిణాది జిల్లాలలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్లు తెలిసింది.

ఈ ఏడాది మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అళగిరిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని కరుణానిధి కుటుంబ సభ్యులు, పార్టీలో కొందరు సీనియర్ నేతలు గట్టిగా పట్టుబట్టడంతో కరుణానిధి అందుకు అంగీకరించారు. స్టాలిన్ అందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తునప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడి, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అయిష్టంగానే అందుకు అంగీకరించారు. అళగిరి కూడా పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సిద్దంగానే ఉన్నారు . కనుక త్వరలోనే ఆయన తండ్రిని కలిసి డిఎంకెలో చేరబోతున్నారని తాజా సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ర‌క్త చ‌రిత్ర‌… ఇప్పుడే ఇలా ఉంటే ఫ‌లితాల రోజున ఎలా ఉంటుందో?

ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో...

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close