అది కల్తీ మద్యం కాదు…అందులో సైనేడ్ విషం కలిసిందిట!

కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు కుటుంబీకులకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో అమ్మబడిన కల్తీ మద్యంలో అత్యంత ప్రమాదకరమయిన పొటాషియం సైనేడ్ అనే విష పదార్ధం కలుపబడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాధమికంగా నిర్ధారణ చేసింది. కానీ దీనిని మళ్ళీ నిర్ధారించుకొనేందుకు స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో నుండి సేకరించిన మద్యం నమూనాలను హైదరాబాద్ లోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. అది కూడా పొటాషియం సైనేడ్ కలిసినట్లు నిర్ధారణ చేసినట్లయితే ఇది సాధారణ కల్తీ మద్యం కేసు కాదని, మల్లాది విష్ణు యొక్క వ్యాపార లేదా రాజకీయ శత్రువులు ఎవరో ఆయనను దెబ్బ తీసేందుకు కావాలనే చేసిన కుట్ర అని అనుమానించవలసి ఉంటుంది.

డిశంబర్ 8వ తేదీన కృష్ణలంకలో మల్లాది విష్ణు కుటుంబీకులకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఎక్సయిజ్ శాఖ అధికారులు స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో సరఫరా అవుతున్న మద్యం నమూనాలను సేకరించి బార్ ని మూసివేశారు. సాధారణంగా కల్తీ మద్యం అనగానే అందులో మిథైల్‌ ఆల్కహాల్‌ కలిసి ఉండవచ్చని అనుమానిస్తారు. కానీ దీనిలో భయంకరమయిన సైనేడ్ విషపదార్ధం కనుగొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మల్లాది విష్ణుతో సహా అనేకమందిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ఈ తాజా నివేదిక ఈ కేసును కొత్త మలుపు తిప్పే అవకాశం కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close