తెరాసకు ఉడతాభక్తితో సహాయపడుతున్న సాక్షి మీడియా

తెరాస-వైకాపాల మధ్య ఏదో రహస్య అనుబందం ఉందనేది బహిరంగ రహస్యమే. దానిని వైకాపా చాలా సార్లు రుజువు చేసి చూపించింది కూడా. తెరాస కూడా ఏనాడూ వైకాపాని గట్టిగా విమర్శించిన దాఖలాలు లేవు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పోటీ చేసేందుకు వైకాపాకి అభ్యర్ధులు కోరవడటంతో బరిలో నుంచి తప్పుకొంది. బరిలో నుంచి తప్పుకొన్నప్పటికీ తెరాస గెలుపు కోసం అది యధాశక్తిగా కృషి చేస్తూనే ఉందని చెప్పవచ్చును.

ఆ పార్టీకి చెందిన సాక్షి మీడియాలో వస్తున్న వార్తలు, విశ్లేషణలను గమనించినట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస నేతల కార్యక్రమాల గురించి, వారి ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, ఎన్నికల ప్రచారం, షెడ్యూల్, మేనిఫెస్టో…ఇలాగ తెరాసకు సంబందించి ప్రతీ చైనా పెద్ద విషయాలనీ తన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ తెరాసకు ఉడతాభక్తిగా సహాయపడుతోంది. అలాగే తెరాస మేనిఫెస్టో విడుదల, మంత్రి కె.టి.ఆర్. ప్రచార షెడ్యూల్, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ వివరాల గురించి ఈ రోజు సంచికలో ప్రచురించింది.

అలాగని తన ప్రియశత్రువు తెదేపాను అది విస్మరించలేదు. ఆ పార్టీలో లుకలుకల గురించి, పార్టీని వీడుతున్నవారి గురించి, ఆ కారణంగా తెదేపా ఎదుర్కొంటున్న దుస్థితి గురించి సవివరంగా ప్రచురిస్తూ దానిపై ప్రతీకారం తీర్చుకొంటోంది. ఈ రోజు సంచికలో “గ్రేటర్ ఎన్నికలలో చంద్రబాబు ప్రచారంపై నీలి నీడలు” పేరిట ప్రచురించిన ఒక వార్తలో “చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొన్నట్లయితే తెలంగాణా ఓట్లు పడవని బీజేపీ భయపడుతోందని, అందుకే బీజేపీ అభ్యంతరాలను, తెలంగాణా ఓటర్ల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రచార ప్రణాళిక మారే అవకాశం ఉందని” ఎవరో తెదేపా నేత చెప్పినట్లు వ్రాసింది.

రాజకీయపార్టీలకు మీడియా వత్తాసు పలకడం, వాటి దృక్కోణంలో నుంచే వార్తలు, కధనాలు ప్రచురించడం, వ్యతిరేకిస్తున్న పార్టీలకి వ్యతిరేకంగా వ్రాయడం కొత్తేమీ కాకపోయినా, దాని వలన పత్రికా విలువలు నానాటికీ ఇంకా దిగజారిపోతుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close