నిన్న విప్ ఈ రోజు క్యాన్సిల్..! ఇక శివసేన బీజేపీకి లేనట్లే..!!

భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం శివసేన గట్టి షాక్ ఇచ్చింది. నిన్న మీ వెంటే ఉంటామంటూ… హామీ ఇచ్చి ప్రధాని మోడీ, అమిత్ షాలను ప్రశాంతంగా నిద్రపోనిచ్చిన శివసేన… తెల్లవారేసరికి స్టాండ్ మార్చేసుకుంది. ఓటింగ్ కు దూరం ఉంటామని ప్రకటించింది. శివసేన దూరంగా ఉండటం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు కానీ… భవిష్యత్ రాజకీయాలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపించనుంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలసి పోటీ చేసేది లేదని ఇప్పటికే నిర్ణయం తీసుకన్న శివసేన…అవిశ్వాసం విషయంలో కాస్తంత మెట్టు తగ్గినట్లు అనిపించింది.

దీంతో బీజేపీ వర్గాలు.. తమను శివసేన వీడిపోదని ప్రచారం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లోనూ మహారాష్ట్రాలో కలసి పోటీ చేస్తామన్నట్లుగా సంబరపడ్డాయి. కానీ ఆ ఆనందాన్ని ఉద్దవ్ థాకరే ఎక్కువ సేపు ఉండనీయలేదు. నిన్న విప్‌ పొరపాటుగా జారీ చేశామని, దాన్ని వెనక్కి తీసుకున్నామని పార్టీ సీనియర్‌ నేతలు ఉదయాన్నే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి పోరాటానికి మద్దతు తెలుపాలని కోరేందుకు.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివసేన చీఫ్ ను కలవాలనుకున్నారు. కానీ సమయం ఇవ్వలేదు. దాంతో బీజేపీవైపే శివసేన ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. కానీ తమ విధానం ఒంటరి పోరేనని మరోసారి స్పష్టం చేసినట్లయింది. బీజేపీ, శివసేన భావసారూప్యత ఉన్న పార్టీలు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత మహారాష్ట్రలో శివసేన క్యాడర్ ను… తమలో కలుపుకోవాలన్న ప్రయత్నం జరిగింది. దీంతో తమ పార్టీపై కుట్ర చేస్తున్నారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఎన్డీఏలో ఉన్నప్పటికీ…లేనట్లుగానే వ్యవహరిస్తోంది. మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మిత్రులందరూ దూరమవుతూండటంతో కొద్ది రోజులు క్రితం అమిత్ షా ప్రత్యేకంగా ముంబై వెళ్లి శివసేన చీఫ్ తో సమావేశయ్యారు. అయినా పరిస్థితులు మెరుగుపడలేదని తాజా నిర్ణయంతో తేటతెల్లమయింది. ఇది అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి వచ్చిన మొదటి షాక్ గా చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close