తాటతీస్తాం…గుడ్డలూడదీస్తాం అంటేనే బలమైన వాదనా..? పవన్ లాజిక్ తేడాగా ఉందే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ … పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసంపై… చర్చ ప్రారంభమయ్యే రెండు గంటల ముందే తెలిసినట్లు… ఉదయమే హడావుడిగా ట్వీట్లు చేశారు. టీడీపీపై ఉన్న కోపంతోనే మోడీ ఏపీకి ఏమీ ఇవ్వడం లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. న్యాయం కోసం పోరాడటానికి పార్లమెంట్ కన్నా…గొప్ప వేదిక ఉండదన్నారు. న్యాయాన్ని “డెలివరీ” చేయాలని కూడా ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నానికి మళ్లీ వెంటనే ట్వీట్లు ప్రారంభించారు. ఈ సారి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం … అంతా పస లేకుండా సాగిందన్నట్లుగా ట్విట్టర్ లో తేల్చి పడేశారు.

అవిశ్వాసంపై టీడీపీ వాదన పవన్ కల్యాణ్ కు చాలా బలహీనంగా కనిపించిందిట. ప్రత్యేక హోదా అంశాన్ని సరైన రీతిలో ప్రస్తావించిలేకపోయారట. పార్టీకోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడిందని తేల్చేశారు. ఏపీ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుందని ట్వీట్ తీర్పిచ్చారు. నిజానికి గల్లా జయదేవ్ ప్రసంగాన్ని పార్లమెంట్ సభ్యులే కాదు..జాతీయ టీవీ చానళ్లు కూడా.. బ్రేకులు తీసుకోకుండా ప్రసారం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి సూటిగా తగిలేలా ప్రసంగం ఉందని అభిప్రాయపడ్డాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం .. తెలుగుదేశం పార్టీ వాదన చాలా బలహీనంగా ఉందని తేల్చేశారు. గతంలో పవన్ కల్యాణ్ పై… గల్లా జయదేవ్.. వరుస ట్వీట్లతో విమర్శలు చేశారు. అప్పుడే పవన్ కల్యాణ్ వన్ స్పీచ్ వండర్ అంటూ.. సినిమా డైలాగులతో… గల్లా జయదేవ్ పై విమర్శలు కురిపించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా… గల్లా జయదేవ్ పై వ్యక్తిగత విమర్శలు చేశాయి. దీనిపైనా గల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు.

బలమైన వాదన అంటే.. గుడ్డలిప్పదీస్తాం… తరిమికొడతాం.. చొక్కాలు పట్టుకుంటాం… తాటతీస్తాం అనే పదాలతో ఆవేశపడటం కాదని.. తెలుగుదేశం పార్టీ వర్గాలు పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇస్తున్నాయి. పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ ఈలల మధ్య చేసే ప్రసంగాలే బలమైన వాదనలుగా భావిస్తున్నారని అంటున్నారు. ఏదో నోటికొచ్చినట్లు పార్లమెంట్ లో ప్రసంగిస్తే…కుదరదని.. గుర్తు చేస్తున్నారు. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని మాత్రమే… విశ్లేషించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత… బీజేపీ స్పందన… ఇతర విషయాలపై మాత్రం ట్వీట్లు బంద్ చేశారు. ఎలాగూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు కాబట్టి… బీజేపీ నేతలు వ్యతిరేక ప్రకటనలు చేసినా.. టీడీపీనే పవన్ నిందించేలా ట్వీట్లు పెడతారని టీడీపీ నేతలు ముందుగానే చెప్పేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close