ఆంధ్రాలోనూ కాంగ్రెస్ కొత్త పొత్తులుంటాయా..?

పార్టీ అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న తొలిసారిగా సీడ‌బ్ల్యూసీ విస్తృత స్థాయి స‌మావేశం ఢిల్లీలో జ‌రిగింది. పీసీసీ అధ్య‌క్షులు, ఇన్ ఛార్జ్‌లతోపాటు ముఖ్య‌మంత్రులూ, మాజీ ముఖ్య‌మంత్రులూ.. ఇలా మొత్తంగా దాదాపు 50కిపైగా ప్ర‌ముఖ నేత‌లు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఎలా స‌మాయ‌త్తం కావాల‌నే ల‌క్ష్యంతో ఈ స‌మావేశం నిర్వ‌హించారు. పొత్తుల విష‌య‌మై ఒక స్ప‌ష్ట‌మైన అభిప్రాయం ఇక్క‌డ వ్య‌క్త‌మైంది. మారుతున్న ప‌రిస్థితులకు అనుగుణంగా నిర్ణ‌యాల్లో కొన్ని మార్పులు త‌ప్ప‌వ‌ని పి. చిదంబ‌రం ప్ర‌తిపాదించారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని ఎన్డీయేని ఎదుర్కోవ‌డం కోసం అవ‌స‌ర‌మైతే క‌ర్ణాట‌క‌ ఫార్ములా ప్రకారం ఇత‌ర పార్టీల‌ను ముందు వ‌రుస‌లో నిల‌బెట్టి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌మ‌ని ఈ స‌మావేశంలో చర్చించడం విశేషం. దీంతోపాటు కొత్త పొత్తుల‌కు ఆస్కారం ఉంటుంద‌నే సంకేతాలిచ్చారు.

ఇక‌, ఆంధ్రా విష‌యానికొస్తే.. ప్ర‌త్యేక హోదాకి తాము కట్టుబ‌డి ఉన్నామ‌ని రాహుల్ గాంధీ పున‌రుద్ఘాటించారు. ఈ స‌మావేశం విష‌యాల‌ను ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు రఘువీరా రెడ్డి మీడియాకు వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా పార్టీ శ్రేణుల‌ను స‌మాయత్తం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధ‌మౌతోంద‌న్నారు. 2019లో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే తాము తీసుకోబోయే మొద‌టి నిర్ణ‌యం ప్ర‌త్యేక హోదాతోపాటు, విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు అమ‌లు చేయ‌డ‌మేన‌ని రాహుల్ చెర‌ప్పార‌ని ర‌ఘువీరా చెప్పారు. ఆంధ్రాకి ఆదుకోవాల్సిన బాధ్య‌త త‌మ పార్టీ ఉంద‌ని రాహుల్ చెప్పార‌న్నారు. ఇదే విష‌య‌మై 29 రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు కూడా ఏక‌గ్రీవంగా ఈ ప్ర‌తిపాద‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌న్నారు.

ఆంధ్రా విష‌యంలో కేవ‌లం ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌నే ప్ర‌ధాన ప్ర‌చారాస్త్రాలుగా కాంగ్రెస్ ప్ర‌యోగించ‌బోతోంద‌నేది మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ఇక‌, పొత్తుల విష‌య‌మై కొత్త స‌మీక‌ర‌ణాల‌కు కూడా సిద్ధ‌మ‌ని పార్టీ చెబుతున్న నేప‌థ్యంలో… ఆంధ్రా విష‌యంలో పొత్తులకు కాంగ్రెస్ సిద్ధమా కాదానే స్ప‌ష్ట‌త ఇంకా రావాల్సి ఉంది. వాస్తవం మాట్లాడుకుంటే, సోలోగా పోటీ చేసినా నిర్ణ‌యాత్మ‌క ఫ‌లితాల‌ను సాధించే స్థాయిలో ఏపీ కాంగ్రెస్ ఇప్పటికి లేదు. ఎలాగూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధాన అజెండా అంటున్నారు, భాజ‌పా స‌ర్కారు ఆంధ్రాని మోసం చేసిందంటున్నారు. ఇవే ల‌క్ష్యాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మౌతున్న పార్టీలు ఏపీలోనూ ఉన్నాయి. కాబ‌ట్టి, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మౌతూ కొత్త ప్ర‌య‌త్నాలేవైనా చేస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close