టీడీపీ ఎంపీల రాజీనామాల కోసమే వైసీపీ బంద్..! జగన్‌కు వచ్చే లాభమేంటి..?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తెలిసి చేస్తున్నారో..తెలియక చేస్తున్నారో కానీ… ఎదురు తన్నే రాజకీయ నిర్ణయాలనే తీసుకుంటున్నారు. తనకు కానీ.. పార్టీకి కానీ మంచి జరిగే నిర్ణయం ఒక్కటీ కూడా తీసుకోవడం లేదు. పార్లమెంట్‌కు ఎంపీలతో రాజీనామాలు చేయడం.. ఓ పెద్ద సెల్ఫ్ గోల్‌గా మారిపోయింది. ఓ వైపు టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తూంటే.. వైసీపీ మాజీ ఎంపీలు నిస్సహాయంగా.. పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం వద్ద నిలబడాల్సి వచ్చింది. రాజీనామాలు చేసిన తర్వాతైనా ఉద్యమం చేయించారా అంటే.. అదీ లేదు. రాజీనామాల నిర్ణయం ఇంతగా ఎదురు తన్నిన తర్వాత.. ఇప్పుడు మరో రాజకీయ ఎత్తుగడ వేశారు. అదే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడం.

నేను ఎంపీలతో రాజీనామాలు చేయించి.. చాలా నష్టపోయాను కాబట్టి.. ఎలాగైనా.. టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి..సమానం చేయాలనుకుంటున్నట్లున్నారు జగన్. మంగళవారం వైసీపీ బంద్… ప్రత్యేకహోదా కోసం కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ ఎంపీలను రాజీనామాలు చేయాలనే ఒత్తిడి పెంచడానికేనట. ఆ పార్టీ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి… చేసిన చెలెంజ్‌లన్నీ…ఇలాగే ఉన్నాయి. ” రాజీనామా చేసే దమ్ముందా..?” .. ధమ్సప్ యాడ్ ప్రకటనల్లాగా చేసుకుంటూ వెళ్లారు. దానికి సాక్షి మీడియా కవరేజీ కూడా బాగానే ఇచ్చుకుంది. అయినా రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఏం చేయగలిగారో అందరూ చూశారు.. మళ్లీ ఇప్పుడు టీడీపీ ఎంపీలను కూడా జగన్ ఎందుకు రాజీనామా చేయమంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

అయినా ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నానంటే.. మైలేజీ వస్తుంది కానీ.. టీడీపీ ఎంపీల రాజీనామాల కోసం బంద్ చేస్తున్నామంటే.. ప్రజలు కూడా నవ్వుకోకుండా ఉంటారా..?. అసెంబ్లీకి వెళ్లరు.. పార్లమెంట్‌కు వెళ్లరు.. పార్లమెంట్‌కు వెళ్లి పోరాటం చేస్తున్న వారిని కూడా రాజీనామాలు చేయించి.. ఇంట్లో కూర్చోవాలని జగన్ డిమాండ్ చేయడం.. చాలా మంది సొంత పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. పార్లమెంట్‌లో తమకు అడ్డం లేకుండా.. టీడీపీ ఎంపీలతో .. రాజీనామా మైండ్ గేమ్ ఆడాలని.. బీజేపీ టాస్క్ ఇచ్చిందేమో అన్న సందేహం చాలా మందిలో ప్రారంభమయింది. ఈ వ్యూహం వెనుక అసలు కోణం జగన్‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close