పూర్ణ లేనిదే ప‌రి `పూర్ణ‌`0 కాదా??

చిత్ర‌సీమ‌లో బోలెడ‌న్ని సెంటిమెంట్లు. ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఓ సెంటిమెంట్ న‌డిపిస్తుంటుంది. ర‌విబాబుకీ చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. త‌న సినిమాలో ఏదో ఓ ఫ్రేమ్‌లో ఆయ‌న కూడా క‌నిపించ‌డం ఓ ఆన‌వాయితీగా మారింది. ఇప్పుడు `పూర్ణ‌` కూడా త‌న సెంటిమెంట్ లో భాగ‌మైపోయింది. `అవును` కోసం పూర్ణ‌ని హీరోయిన్‌గా తీసుకున్నాడు ర‌విబాబు. ఆసినిమా హిట్ట‌య్యింది. ఆ సెంటిమెంట్‌తోనే `అవును 2`, `ల‌డ్డూ బాబు`ల‌లోనూ పూర్ణ‌ని క‌థానాయిక‌గా తీసుకున్నాడు. రెండూ ఫ్లాపులే. కానీ ర‌విబాబు సెంటిమెంట్‌ని మాత్రం వ‌ద‌ల్లేదు. ఇప్పుడు `అదిగో`లోనూ ఆమెకు చోటిచ్చాడు. పూర్ణ కోసం ఓ ఐటెమ్ పాట డిజైన్ చేసి వ‌దిలాడు.

నిజానికి `అదిగో` సినిమా ఎప్పుడో పూర్త‌యిపోయింది. ఐటెమ్ పాట మాత్రం ఇప్పుడు షూట్ చేసి అతికించారు. ఇదంతా పూర్ణ కోస‌మే అని టాక్‌. ర‌విబాబు సినిమాల్లో ఐటెమ్ గీతాలుండ‌వు. ఈచిత్రానికి నిర్మాత అయిన సురేష్ బాబు కూడా ఇలాంటి ఎగ‌స్ట్రా వ్య‌వ‌హారాల‌కు దూరం. సినిమా క‌థ‌కి అవ‌స‌రం లేని ప‌నిని ఆయ‌న ఎప్పుడూ… ప్రోత్స‌హించ‌డు. కేవ‌లం ర‌విబాబు కోస‌మే ఐటెమ్ పాట‌కు ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. క‌థ‌లో ఐటెమ్ గీతానికి ఏమాత్రం ఛాన్సు లేక‌పోయినా పూర్ణ‌ని తీసుకొచ్చి ఓ పాట చేయించేశార‌ని తెలుస్తోంది. అదిగో ఓ పంది పిల్ల క‌థ‌. తెలిసిన మొహాలెవ‌రూ ఉండ‌రు. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల్ని జోడించ‌డానికే తొలిసారి ర‌విబాబు.. ఐటెమ్ గీతాల దారి ఎంచుకున్నాడేమో అనిపిస్తోంది. దానికి తోడు.. పూర్ణ‌కి కూడా ఏదో ఓ రోల్ ఇవ్వ‌నిదే.. ఆయ‌న సినిమా ప‌రిపూర్ణం అవ్వ‌డం లేదాయె. అందుకే… చివ‌రి నిమిషంలో ఈ మార్పుల‌కు పూనుకున్నాడు ర‌విబాబు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close