మోడీ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో రజనీకాంత్..!

నరేంద్రమోదీకి సన్నిహితుడిగా, బీజేపీ అనుకూలుడిగా గుర్తింపు ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్.. భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్టుగా బీజేపీ ప్రమోదకరమైన పార్టీయేనేమోనని అన్నారు. అంతే కాకుండా నోట్ల రద్దు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని రజనీకాంత్ సమర్థించారు. ఇది సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశమని, ఈ విషయంపై ఒక్క మాటలో సమాధానం చెప్పటం కష్టమని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని భావించడం వల్లే విపక్షాలు కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయని రజినీకాంత్ అన్నారు. బీజేపీపై రజినీ ఇలా స్పందించడంతో తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయనకు మద్దతుగా ఉంటూ వస్తున్న రజనీకాంత్ ఉన్నట్టుండి ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలేంటనే చర్చ విస్తృతమైంది. డిసెంబర్ ఇరవై రెండో తేదీన.. రజనీకాంత్ పార్టీని ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో… బీజేపీ అనుకూల ముద్ర పడితే.. మొత్తానికే మోసం వస్తుందన్న భావనలో ఆయన ప్లేటు ఫిరాయించారని చెబుతున్నారు.

కానీ రజనీంత్ వ్యవహారశైలి గురించి తెలిసిన వాళ్లు మాత్రం.. రేపు మోడీని పొగిడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇటీవల స్టెరిలైట్ పరిశ్రమ కాల్పుల వ్యవహారంలోనూ.. ఆయన అన్నాడీఎంకేకు.. కేంద్రానికి మద్దతుగా మాట్లాడారు. బాధితుల ఆగ్రహానికి గురయ్యారు. ఆయనప్పటికీ.. ఆయన విధానాన్ని మార్చుకోలేదు. మరో సూపర్ స్టార్ కమలహాసన్ మాత్రం.. చాలా తీవ్రంగా.. మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కోణంలోనే తనపై ప్రో మోడీ ముద్ర పడితే… తమిళ ప్రజలు ఆదరించరనే భయంతో రజనీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close