జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన బీజేపీ..!

జమ్మూకశ్మీర్ అసెంబ్లీని… అఘమేఘాలపై రద్దు చేసేశారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఇప్పటికే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. రాష్ట్రపతి పాలన విధించి.. డిసెంబర్ ప్రథమార్థానికి ఆరు నెలలు పూర్తవుతాయి. ఈ లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి.. మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ, సజ్జాద్‌ లొనె నాయకత్వంలోని పీపుల్స్‌కాన్ఫరెన్స్‌లు తమకు ప్రభుత్వ అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను అభ్యర్థించాయి. ముఫ్తీకి కాంగ్రెస్‌, నేషనల్‌కాన్ఫరెన్స్‌లు మద్ధతు ఇవ్వగా లోనెకు భాజపా మద్ధతిచ్చాయి. అయితే గవర్నర్‌ ఢిల్లీతో సంప్రదింపులు జరిపి అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపారు. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కానీ.. ఏర్పాటు చేసినా బలం నిరూపించుకునే పరిస్థితి కాని లేదు.

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యుల మద్ధతు కలిగిన పార్టీ పీడీపీ. దీంతో పాటు కాంగ్రెస్‌, ఎన్‌సీలు మద్ధతు ప్రకటించడంతో మొత్తం ఈ కూటమి బ లం 56కి పెరిగింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 89 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌కు పీడీపీ లేఖ రాసింది. ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్‌సీ మెహబూబాకు మద్ధతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో.. ఆ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని.. తెలిసి… కేంద్రం.. వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఉన్న పళంగా.. గవర్నర్ ద్వారా అసెంబ్లీని రద్దు చేయించేశారు. ఓ అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నప్పుడు.. అసెంబ్లీని రద్దు చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

నిజానికి ఐదు నెలల కిందట వరకు…జమ్మూకశ్మీర్‌లో బీజేపీ – పీడీపీ ప్రభుత్వం ఉండేది. ముఖ్యమంత్రిగా పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఉండేవారు. అయితే.. కశ్మీర్‌లో హింస పెరుగుతోందన్న కారణం చూపి… మెహబూబా ముఫ్తీకి ఏ మాత్రం… సమాచారం ఇవ్వకుండా.. మద్దతును బీజేపీ ఉపసంహరించుకుంది. అప్పుడే రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత బీజేపీ.. పీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి.. బీజేపీ తరపున ఓ హిందూ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేయాలని భావించారు. ఆ రాష్ట్రానికి బీజేపీ తరపున ఇన్చార్జ్ గా ఉన్న రామ్‌మాధవ్.. పీడీపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తి చేశారు. అమర్నాథ్ యాత్ర పూర్తయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అనుకున్నారు. కానీ.. బీజేపీని నమ్మడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సిద్ధపడలేదు. దాంతో బీజేపీ తన ప్రయత్నంలో విఫలమయినట్లయింది. చివరికి కాంగ్రెస్ పార్టీ కూటమిగా.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో.. బీజేపీ ఉలిక్కి పడింది. నేరుగా అసెంబ్లీని రద్దు చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఆ రాష్ట్రానికి కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ.. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసిన విధానం మాత్రం… కచ్చితంగా ప్రజాస్వామ్య హననమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close