అభివృద్ధిపై చ‌ర్చ‌కు రావాలంటూ మాణిక్యాల‌రావు స‌వాల్‌!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆంధ్రా ప‌ర్య‌ట‌న‌కు ముందు రాజ‌కీయ వేడి పెంచాల‌న్న‌దే వారి ఉద్దేశ‌మో ఏమో తెలీదుగానీ… మ‌రోసారి స‌వాళ్ల‌కు దిగుతున్నారు మాజీ మంత్రి మాణిక్యాల‌రావు. ఆయ‌న రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం ఆయ‌న తాడేప‌ల్లిగూడెంలో విలేక‌రుల స‌మావేశంలో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పాల‌న‌లో రాష్ట్ర అభివృద్ధి ప‌డ‌కేసింద‌న్నారు. జ‌రిగిన ఆ కొంత అభివృద్ధిని కూడా కొన్ని ప్రాంతాల‌కు మాత్ర‌మే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిమితం చేశారంటూ ఆరోపించారు. ఇదే అంశ‌మై బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధంగా ఉన్నాన‌నీ, ముఖ్య‌మంత్రి కూడా త‌న‌తో చ‌ర్చ‌కు వ‌స్తారా అంటూ స‌వాల్ విసిరారు.

గోదావ‌రి జిల్లాలకు ముఖ్య‌మంత్రి తీర‌ని అన్యాయం చేశార‌న్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు మ‌రింత అన్యాయం జ‌రిగింద‌న్నారు. ఈ జిల్లాకు చంద్ర‌బాబు చేసిన అభివృద్ధి ఏంటో చెప్ప‌గ‌ల‌రా అనీ, ఈ ప్రాంతంపై చిన్న‌చూపు ఎందుకు అంటూ ఆయ‌న విమ‌ర్శించారు. ఆయ‌న చేసిన అభివృద్ధి ఏంటో చెప్ప‌మంటూ మ‌రోసారి స‌వాల్ చేశారు. ఈ జిల్లా ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రిపై ఆగ్ర‌హంగా ఉన్నార‌న్నారు.

రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధిపై మాణిక్యాల‌రావు స‌వాల్ చేయ‌డం విచిత్రంగా ఉంది! ఎందుకంటే, ఆంధ్రాలో జ‌రిగిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌న్నీ కేంద్రం వ‌ల్ల‌నే, భాజ‌పా వ‌ల్ల‌నే జ‌రుగుతున్నాయ‌ని క‌దా ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మొద‌లుకొని నేతలంద‌రూ చెబుతారు! పోల‌వ‌రం వారే క‌ట్టించామ‌నీ, ఇళ్లూ మ‌రుగుదొడ్లూ… ఇలా అన్నీ మోడీ చ‌ల‌వ వ‌ల్ల‌నే వ‌చ్చాయంటూ ఊద‌ర‌గొడుతున్నారు. అంతేకాదు, కేంద్ర ప‌థ‌కాల‌కు పేర్లు మార్చి, త‌న‌విగా చంద్ర‌బాబు అమ‌లు చేసుకుంటున్నార‌ని కూడా అంటారే! అంటే… పేర్లు మార్చైనా స‌రే అభివృద్ధి ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్న‌ట్టుగా వారే ప‌రోక్షంగా ఒప్పుకుంటున్న‌ట్టే క‌దా. అంటే, ఆ ప‌థ‌కాలేవీ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అమ‌లు కావ‌డం లేదా..? పోనీ, కేంద్ర ప‌థ‌కాలు రాష్ట్రంలో అమ‌లు అవుతున్నాయ‌ని చెప్పుకుంటారు క‌దా… అవి కూడా ఆ జిల్లాలో అమ‌లు కావ‌డం లేదా..? ఇంతకీ ఏ పాయింట్ మీద చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ మాణిక్యాల‌రావు స‌వాల్ చేస్తారు..? ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్‌, ఇత‌ర విభ‌జ‌న హామీలు… ఇవ‌న్నీ కేంద్రం ఎందుకు అమ‌లు చెయ్య‌లేదో ఆయ‌న చెప్ప‌గ‌ల‌రా..? మ‌రెందుకీ స‌వాళ్లు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close