మళ్లీ వైసీపీలోకే గుర్నాథరెడ్డి..! “మిస్సమ్మ బంగ్లా”లోనే మిస్టరీ..!?

అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఆ తర్వాత… టీడీపీలో చేరారు. ఒక సంవత్సరం కాక ముందే… మళ్లీ వైసీపీలోకి చేరిపోయారు. అనంతపురం నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గం ఉన్న నేతల్లో గుర్నాథరెడ్డి ఒకరు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రొత్సాహంతో వారు.. అనంతపురంలో బలంగా ఎదిగారు. వైఎస్ మరణం తర్వాత వారు.. జగన్‌తో కలిశారు. జగన్ తో పాటు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయాలు సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పట్టించుకోవడం లేదంటూ.. కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో జగన్ వేరే వారిని ఇన్‌చార్జిగా నియమించారు. దాంతో.. జేసీ దివాకర్ రెడ్డి సాయంతో టీడీపీలోకి వచ్చారు.

గుర్నాథ్ రెడ్డి రాకను టీడీపీ నేతలంతా వ్యతిరేకించారు. అయినా ..తనకు వ్యతిరేకంగా ఉంటున్న అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపలకు చెక్ పెట్టడానికి జేసీ పట్టుబట్టి.. టీడీపీలో చేర్పించారు. గుర్నాథరెడ్డి టీడీపీలోచేరడానికి ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉందని.. చెబుతున్నారు. అదే మిస్సమ్మ బంగ్లా. వైఎస్ హయాలో.. మిస్సమ్మ బంగ్లా ఆస్తులను గుర్నాథరెడ్డి సోదరులు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తేలింది. సీఐడీ విచారణలో రూ.200 కోట్ల విలువ చేసే మిస్సమ్మ బంగ్లా కేసులో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఏడుగురిపై 420, 406, 461, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1 రెడ్డప్పరెడ్డి, ఏ2 గుర్నాథరెడ్డి, ఏ3 ఎర్రి స్వామిరెడ్డి వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, శాంతిమూర్తిసహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.

టీడీపీలో చేరితే.. ఏమైనా ఫేవర్ చేస్తారేమోనని.. గుర్నాథరెడ్డి భావించారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించకపోగా… పార్టీలో కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెబుతున్నారు. గుర్నాథరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిదయిందని.. జేసీ ఒత్తిడికి తొలగ్గి.. ఏదో కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లయితే.. మొత్తం అనంతపురం జిల్లా టీడీపీలో చిచ్చు రేగేదని… ఆ పార్టీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close