ఏపీలో కాంగ్రెస్‌తో టీడీపీ సీట్ల సర్దుబాటు లేనట్లే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి రాజకీయ వ్యూహం అమలు చేయాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో నాలుగుగంటల పర్యటనలో.. రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన … సీట్ల సర్దుబాటు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని.. కాంగ్రెస్‌తోనూ ఇందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేకపోయినా… జాతీయస్థాయిలో కలిసొచ్చే అంశాలు పరిశీలించాలని వ్యాఖ్యానించారు. అంటే ఆయన… రాహుల్‌గాంధీతో.. ఏపీలోని పరిస్థితుల్ని వివరించి.. సీట్ల సర్దుబాటు సాధ్యం కాదని… జాతీయ స్థాయిలో మాత్రం మద్దతుగా ఉంటామని చెప్పినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న నేతలు.. ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా తిరిగి.. రఘువీరారెడ్డి ఓ లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇచ్చారు. పొత్తుల సంగతి త్వరగా తేల్చాలని కోరారు. అయితే.. తెలంగాణ ఎన్నికల్లో… భారీ ఎదురు దెబ్బ తగలడంతో.. చంద్రబాబు సీట్ల సర్దుబాటు విషయంలో.. ఆలోచిస్తున్నారు. అనేక సర్వేలు.. పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే… కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు వద్దనే ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే… రాహుల్‌కు తన అభిప్రాయం చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు.. పరోక్షంగా తెలియజేస్తున్నారు.

బీజేపీయేతర కూటమి పక్షాలకు 19వ తేదీ కీలకం. ఆ రోజున మమతా బెనర్జీ.. కోల్‌కతాలో బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీని దెబ్బకొట్టడానికి.. ఆమె పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా రెడీ అయ్యారు. ఇప్పటికే ఒకర్ని చేర్చుకున్నారు. మరో ఐదుగురు వస్తారంటూ.. ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో… మమతా బెనర్జీ… ర్యాలీలో.. విపక్షాల ఐక్యతను చాటాలనుకుంటున్నారు. కానీ ఆమె కాంగ్రెస్‌తో దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంగా.. వీలైనన్ని ఎక్కువ విపక్ష పార్టీలను.. కోల్‌కతా ర్యాలీకి హాజరయ్యేలా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ ర్యాలీలో విపక్షాలు ఐక్యత చూపించగలిగితే… చంద్రబాబు కూడా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు అంశంపై నిర్ణయం వెంటనే ప్రకటించడానికి అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close