2019 లో తప్పు చేస్తే ప్రజలను ఎవరు కాపాడలేరు, రోజా వివాదాస్పద వ్యాఖ్యలు

వైఎస్ఆర్ సి పి నేత మరియు హీరోయిన్ రోజా అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆమె చేసే వ్యాఖ్యలు పలుమార్లు పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టడమే కాకుండా, నంద్యాల ఉప ఎన్నికల లాంటి కొన్నిసందర్భాలలో పార్టీ ని కోలుకోలేని దెబ్బతీశాయి కూడా. ఇప్పుడు రోజా మరొకసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాదయాత్ర ముగిసింది. ఆ సందర్భంగా ఆయన తిరుమలకు వెళుతున్నారు. తిరుపతిలోను, రేణిగుంట లోను పలువురు నేతలు, ఇంకా చాలామంది అభిమానులు జగన్ ని కలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, 2014లో రకరకాల కారణాల వల్ల ప్రజలు పొరపాటు నిర్ణయం తీసుకున్నారని, జగన్ కి బదులుగా చంద్రబాబును గెలిపించి పొరపాటు చేశారని అన్నారు. అక్కడితో ఆగకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి, 2019 ఎన్నికల్లో ప్రజలు అలాంటి పొరపాటు చేయరని తాను అనుకుంటున్నానని, ఒకవేళ జగన్ ని గెలిపించకుండా ప్రజలు తప్పు చేస్తే గనుక ప్రజలను ఎవరూ కూడా కాపాడలేరు అని రోజా వ్యాఖ్యానించారు.

రోజా వ్యాఖ్యలు చూసిన ప్రజలు దాదాపుగా విస్మయం చెందారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల దే నిర్ణయం. పైగా తలపండిన రాజకీయ విశ్లేషకుల కంటే, మహా మహా మేధావుల కంటే ప్రజలు మరింత వివేకంతో ఓటు వేస్తారని, మరింత విజ్ఞతతో వ్యవహరిస్తారని గతంలో పలు ఎన్నికలలో రుజువైంది. ఏది ఏమైనా ఓటు వేసే ప్రజలను అభ్యర్థించింది పోయి ఓటు వేయకపోతే మీకే నష్టం, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అన్నట్టుగా రోజా చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close